Tuesday, 28 July 2026 10:55:02 PM
# చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు..

61, 62 వార్డులలో ఇంటింటి సర్వే చేసిన టీడీపీ నందికొట్కూరు అబ్జర్వర్‌ & ఏపీఈడబ్ల్యూఐడిసి రాష్ట్ర డైరెక్టర్- జి.నాగముని

Date : 04 December 2025 12:33 AM Views : 249

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ & తెలుగుదేశం పార్టీ నందికొట్కూరు వార్డు అబ్జర్వర్‌- జి.నాగముని నందికొట్కూరు పట్టణంలో ఇంటింటి సర్వే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సర్వేలో భాగంగా ఈరోజు 61, 62 బూత్‌లలో టీడీపీ స్థానిక నాయకులను కలిసి, అక్కడి ఓటు బ్యాంక్ పరిస్థితిని తెలుసుకున్నారు. ప్రతి వార్డులో పార్టీకి ఉన్న బలం, సమస్యలు, ఓటర్ల అభిప్రాయం వంటి అంశాలపై వివరాలు సేకరణ చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా టిడిపి వార్డు అబ్జర్వర్ & ఏపీఈడబ్ల్యూఐడిసి రాష్ట్ర డైరెక్టర్- జి.నాగముని మాట్లాడుతూ కొన్ని వార్డులలో ఓటింగ్ శాతం తక్కువగా ఉండడానికి కారణాలు వార్డు నాయకులతో తెలుసుకున్నామని తెలిపారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం ఓటు బ్యాంకును బలోపేతం చేసే విధానంపై వార్డు ఇంచార్జీలకు, నాయకులకు సూచనలు ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అబ్జర్వర్ యల్లగౌడు(డోన్), నందికొట్కూరు పట్టణం బూత్ కన్వీనర్లు, బూతులు ఇన్చార్జీలు షాషా, సయ్యద్ శ్రీకాంత్ గౌడ్, భాస్కర్ రెడ్డి, భారత రెడ్డి, చిన్నరాజు శాంతరాజు, తదితర నందికొట్కూరు పట్టణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :