ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ & తెలుగుదేశం పార్టీ నందికొట్కూరు వార్డు అబ్జర్వర్- జి.నాగముని నందికొట్కూరు పట్టణంలో ఇంటింటి సర్వే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సర్వేలో భాగంగా ఈరోజు 61, 62 బూత్లలో టీడీపీ స్థానిక నాయకులను కలిసి, అక్కడి ఓటు బ్యాంక్ పరిస్థితిని తెలుసుకున్నారు. ప్రతి వార్డులో పార్టీకి ఉన్న బలం, సమస్యలు, ఓటర్ల అభిప్రాయం వంటి అంశాలపై వివరాలు సేకరణ చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా టిడిపి వార్డు అబ్జర్వర్ & ఏపీఈడబ్ల్యూఐడిసి రాష్ట్ర డైరెక్టర్- జి.నాగముని మాట్లాడుతూ కొన్ని వార్డులలో ఓటింగ్ శాతం తక్కువగా ఉండడానికి కారణాలు వార్డు నాయకులతో తెలుసుకున్నామని తెలిపారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం ఓటు బ్యాంకును బలోపేతం చేసే విధానంపై వార్డు ఇంచార్జీలకు, నాయకులకు సూచనలు ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అబ్జర్వర్ యల్లగౌడు(డోన్), నందికొట్కూరు పట్టణం బూత్ కన్వీనర్లు, బూతులు ఇన్చార్జీలు షాషా, సయ్యద్ శ్రీకాంత్ గౌడ్, భాస్కర్ రెడ్డి, భారత రెడ్డి, చిన్నరాజు శాంతరాజు, తదితర నందికొట్కూరు పట్టణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
E Nivas News