ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పగిడ్యాల : వికాషిత్ భారత్ జి రాంజీ పథకం రద్దు చేయాలి, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలి, జాతీయ ఉపాధి హామీ పథకం పని చేస్తున్న వ్యవసాయ కూలీలకు గడ్డపార పనిముట్లు పంపిణీ చేసి,పాత విధానాన్ని కొనసాగించాలని సి.పి.ఐ(ఎం.ఎల్) లిబరేషన్ జిల్లా కార్యదర్శి పిక్కిలి.వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సోమవారం రోజు పగిడ్యాల మండలంలోని, లక్ష్మాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని అంచ వద్ద ఉన్న చెరువులో పని చేస్తున్న వ్యవసాయ కూలీలను కలిసి వారికున్న సమస్యల గురించి వివరంగా అడిగి తెలుసుకోవడం జరిగింది. అనంతరం సి.పి.ఐ (ఎం.ఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఉపాధి హామీ పథకం పాత పద్ధతుల్లోనే కొనసాగించాలని తీర్మానం చేయాలని సి.పి.ఐ (ఎం.ఎల్) లిబరేషన్ డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా, నందికొట్కూరు నియోజకవర్గం ఉపాధి కూలీలకు మౌలిక వసతులు కల్పించాలని మంచినీటి సమస్య, మజ్జిగ, 4 కిలోమీటర్లు నడిచి వస్తున్న వారికి రవాణా చార్జీలు ఇవ్వాలని,పేస్ యాప్ రద్దు చేయాలని, సరైన సమయంలో నెట్టు రాకపోవడంతో కొంతమంది కూలీలు వెనక్కి పోయే పరిస్థితి ఉందన్నారు. కూలీలు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందన్నారుగత 10 సంవత్సరాల క్రిందట ఇచ్చినటువంటి గడ్డపారలు తప్ప, ఇంతవరకు పనిముట్లు ఇవ్వలేదని ఆవేదన పడ్డారు ఉపాధి కూలీలకు ఉష్ణోగ్రత 45%శాతం ఉండడం వల్ల ఉపాధి కూలీలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి కూలీలకు రోజు వారి కూలీ 600 రూపాయలు వేతనం కల్పించాలని 200 రోజులు పని కల్పించాలని వేసవి అలవెన్స్ 30 శాతం ఇవ్వాలని ప్రతి ఉపాధి కూలీకి పదివేల రూపాయల పెన్షన్ సౌకర్యం కల్పించాలని పనిచోట ప్రమాదంలో చనిపోతే రూ.30 లక్షలు ఇవ్వాలని ప్రమాదంలో గాయపడిన రూ 5.లక్షలు ఇవ్వాలని, వారికి వీటి సాధనకై ఈ పోరాటాల కొనసాగిస్తామని కూటమి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరికల ఉద్యమం కొనసాగించడానికి సిద్ధమవుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎం.సాములు, జి.జయరాజు, ఏం.సలీం, ఎం.విష్ణువర్ధన్, ఎస్.సలీం, ఎల్.రాజా గౌడ్, జి.నాగన్న, వై.సునీల్, వై.లోకన్న, కే.ఏసేపు, వై.చక్రి, ఫిట్టర్ మాబు, కే.దావీదు, జి.రాజాముని,ఎస్.వజీర్ భాష, ఎం.శ్రీనివాసులు, బి.గోకారి, పి.శేషన్న, ఏ.జానకి రామ్, ఏంరంగస్వామి తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News