ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం నందు టిడిపి లీగల్ సెల్ మరియు లోకేష్ బాబు అభిమానులు ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన ఏపీ ఈడబ్ల్యుఐడీసీ రాష్ట్ర డైరెక్టర్ గంజాయి.నాగముని పాల్గొని జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటీ & విద్యాశాఖ మంత్రి నారా.లోకేష్ కు అందరూ కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి, అనంతరం కేక్ కటింగ్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకొని సంతోషంగా సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని మాట్లాడుతూ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటీ & విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం యువగళం పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలు విని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు సంక్షేమ పథకాలను ఎలాంటి అవినీతి లేకుండా ప్రజలకు అందజేయడం జరిగింది అని అన్నారు. అలానే రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా పెట్టుబడులను తీసుకొని వచ్చి రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా నిరంతరము పాటుపడుతున్న వ్యక్తి మన లోకేష్ బాబు కావున భవిష్యత్తులో ముఖ్యమంత్రిగా మనము చూడాలని ఆయన ఆకాంక్షించారు. మంచి నాయకుడు లోకేష్ బాబు అంటూ ఆయన కొనియాడాడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర న్యాయవాదుల సంఘం కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ విద్య సంక్షేమం మౌలిక సదుపాయాల సంస్థ రాష్ట్ర డైరెక్టర్ జిల్లా కోర్టు పిపి- రంగారావు కుమార్, మాదేశ్ శేషన్న, రాజేష్, తిరుపతయ్య, శేఖర్ బి.కె.నాగరాజ్, రామకృష్ణ, ఇతర న్యాయవాదులు అందరూ పాల్గొని, నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.
Admin
E Nivas News