ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఓర్వకల్ : కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ప్రారంభించింది, రైతుల సంక్షేమమే లక్ష్యంగా, ఎలాంటి వివాదాలకు తావులేకుండా ప్రభుత్వ రాజముద్రతో కూడిన పాసు పుస్తకాలను రైతులకు పంపిణీ చేస్తుందని ఎమ్మెల్యే గౌరు.చరిత రెడ్డి, ఏపీ ఈడబ్ల్యూఐడిసి రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని అన్నారు. ఓర్వకల్లు మండలంలోని, కేతవరం గ్రామంలో "మీ భూమి - మీ హక్కు" ప్రభుత్వ రాజముద్రతో పట్టదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని, రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను టిడిపి నంద్యాల జిల్లా అధ్యక్షురాలు & పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే గౌరు.చరిత రెడ్డి, ఏపీ ఈడబ్ల్యూఐడీసీ రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్, ఎంపిడిఓ, ఎంఈవో,వివిధ శాఖల అధికారులు,మండల స్థాయి, గ్రామ స్థాయి నాయకులు మండల కన్వీనర్ బ్రాహ్మణపల్లి నాగిరెడ్డి, సింగల్ విండో చైర్మన్ సుధాకర్ రెడ్డి, నన్నూరు సింగిల్ విండో చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి, వివిధ గ్రామాల నాయకులు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News