ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / అనంతపురం : భూ సమస్యలు తొందరగా పరిష్కరించి రైతులకు వెంటనే న్యాయం చేయాలని జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు అన్నారు. ఈ సందర్భంగా పాములపాడు మండల తహాసిల్దార్ కార్యాలయానికి వచ్చిన ఆత్మకూరు ఆర్డీవో ఎస్.వెంకట శివ కి వినతిపత్రం ఇస్తూ లింగాల నాగరాజు మాట్లాడుతూ రి సర్వేలో భూమి కొలతలు సరిగ్గా లేక రైతులకు దాదాపు ముప్పై సెంట్ల భూమి నుండి 40 సెంట్ల భూమి కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే సర్వేనెంబర్ లో ఐదు సబ్ డివిజన్ అయితే ఒక్క సబ్ డివిజన్లో రోడ్డు పోతే, వేరే సబ్ డివిజన్లో భూమిలో తక్కువ చేసి చూపిస్తున్నారు. ఇదేంటని అడిగితే ఆ సబ్ డివిజన్ 22ఏ లో ఉన్నందున దాని భూమి తక్కువ చేయకూడదని పక్కా సబ్ డివిజన్లో తక్కువ చేసి చూపిస్తూ రెవెన్యూ అధికారులు కొంతమంది రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆయన అన్నారు. వెంటనే విచారణ జరిపి రైతులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Admin
E Nivas News