ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : తమ సొంత భూముల పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ ఫోటో వద్దన్న రైతుల కోరిక మేరకు కూటమి ప్రభుత్వం ప్రభుత్వ రాజముద్రతో కూడిన కొత్త పట్టదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమం శ్రీశైలం శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు మండల తహసిల్దార్- జి.రత్న రాధిక ఆధ్వర్యంలో కృష్ణాపురం గ్రామం నందు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దీన్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్ ప్రభుత్వం రాజముద్రతో ఉన్న పాస్ పుస్తకాలపై తన ఫోటో ముద్రించి పంపిణీ చేయడం సిగ్గుచేటని, అందుకే ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు గత ఎన్నికల్లో అతన్ని ప్రతిపక్ష హోదా లేకుండా చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పట్టణ టిడిపి అధ్యక్షులు రవీంద్రబాబు, వేణుగోపాల్, డిప్యూటీ తహాసిల్దార్ ఆంజనేయులు, మండల సర్వేయర్ రాజశేఖర్, టిడిపి నాయకులు శివ ప్రసాద్ రెడ్డి, కలీముల్లా, నజీర్ అహ్మద్, శివారెడ్డి, ఈశ్వర్ రెడ్డి, నబి, నారాయణరెడ్డి, వీఆర్వోలు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News