ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : కర్నూలు పట్టణంలోని, జిల్లా పరిషత్ లో ఈరోజు జరిగిన ఆత్మీయ అభినందన సభలో ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్- జి.నాగముని కి ఎడిటర్ తుపాకుల. రమేష్ శాలువా కప్పి, పూలమాలలు మెడలో వేసి ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎడిటర్- తుపాకుల.రమేష్ మాట్లాడుతూ జి.నాగముని న్యాయవాది గుర్తు నుండి మొదలుకొని ఉమ్మడి కర్నూలు జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా, టిడిపి లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసి, ఇప్పుడు ఏపీఈడబ్ల్యూఐడిసి రాష్ట్ర డైరెక్టర్ గా ఎదగడం చాలా సంతోషించదగిన విషయం అన్నారు. ఆయనకు మా పత్రిక ఎడిటర్ల తరపున, విలేకరుల తరఫున ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అన్నారు. రాష్ట్ర డైరెక్టర్- జి.నాగముని ఇటువంటి గొప్ప, గొప్ప పదవులు మరెన్నో చేయాలని మేము ఆ దేవున్ని ప్రార్థిస్తూ ఆకాంక్షిస్తున్నామన్నారు.
Admin
E Nivas News