ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / కొత్తపల్లి : తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం కొత్తపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో మన నందికొట్కూరు నియోజకవర్గ శాసనసభ్యులు గిత్త.జయసూర్య పాల్గొని, శ్రీ కొలనుభారతి అమ్మవారి దేవాలయంను శ్రీశైలం దేవస్థానంలో కలిపేలా చేయడం జరిగిందని, వర్ష ప్రభావం వల్ల ఎద్దులేరువాగు పొంగి అన్ని గ్రామాల ప్రజలకు రాకపోకలు చాలా ఇబ్బంది అవుతుందని దాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారిస్తానని చెప్పడం జరిగింది. నాయకులకు, కార్యకర్తలకు స్థానిక ఎన్నికలలో అందరు కలిసి పార్టీ ని విజయం వైపు నడిపించాలని, అలాగే గ్రామాలలో ఏమైనా సమస్యలు ఉంటే అన్నిటిని పరిష్కరించేవిధంగా చేస్తానని వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి మండల కన్వీనర్ లింగస్వామి గౌడ్, మాజీ కన్వీనర్ చంద్రశేఖర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, సొసైటీ చైర్మన్ నాగేశ్వరావు, సర్పంచ్ శేఖర్, బుచ్చి రెడ్డి, సర్పంచ్ విజయకుమార్, రామిరెడ్డి, ఎమ్మెల్యే గవర్నమెంట్ పిఏ-రవీంద్ర, తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
E Nivas News