ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / అనంతపురం : పాములపాడు మండలం ప్రజల భద్రత, నేరాల నియంత్రణలో భాగంగా ప్రతి దుకాణంలో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని ఎస్సై- పి.తిరుపాలు అన్నారు. సోమవారం మండల కేంద్రమైన పాములపాడులోని, అన్ని దుకాణాల యజమానులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్సై పి.తిరుపాలు మాట్లాడుతూ . నేరస్తులను గుర్తించి పట్టుకోవడంలో సీసీ కెమెరాల దృశ్యాలు కీలక ఆధారాలుగా ఉపయోగపడుతున్నాయని తెలిపారు. ప్రతి షాపు, వ్యాపార సముదాయంలో నాణ్యమైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా దొంగతనాలు, ఇతర నేరాలను అరికట్టే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. గ్రామాలు, పట్టణాల్లో ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడానికి సీసీ కెమెరాల వ్యవస్థ అవసరమని సూచించారు. అలాగే పోలీసు శాఖ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు జాగ్రత్తలు సూచించారు అనంతరం వ్యాపారులందరికీ నోటీసులు జారీ చేశారు. ప్రజలు, వ్యాపారులు పోలీసు శాఖకు సహకరించి తమ పరిసరాల్లో భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ ఎం.వి.రమణ, కానిస్టేబుల్ లు ఏ.ఖాజా, టావేశ్వర్, వ్యాపారస్తులు పాల్గొన్నారు
Admin
E Nivas News