ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని, వేంపెంట గ్రామానికి చెందిన సామాజికవేత్త & సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు డాక్టర్ టేకూరి.నాగేశ్వరావు భారతదేశంలోని 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువతి, యువకులందరూ ఓటరుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా వరల్డ్ హ్యూమన్ రైట్స్ అవార్డు గ్రహీత & అంతర్జాతీయ సమాజ సేవకుడు డాక్టర్ టేకూరి.నాగేశ్వరరావు మాట్లాడుతూ ఓటు అనేది ప్రతి ఒక్కరికి వజ్రాయుధమని అన్నారు. ఓటు హక్కు అనేది ఎవరిని ఎన్నుకోవాలి, ఎవరిని గద్దె దించాలనీ నిర్వహిస్తున్నారు. నమోదు చేసుకోవడానికి అర్హతలు 01 అక్టోబర్, 2008వ సంవత్సరం లేదా అంతకు ముందు జన్మించిన వారు ఓటు హక్కు కు అర్హులనీ అన్నారు. కావాల్సిన పత్రాలు ఆధార్ కార్డు జిరాక్స్, జనన ధృవీకరణ పత్రం జిరాక్స్ /లేదా 10వ తరగతి(ఎస్ఎస్ సి) మార్క్ లిస్ట్ జిరాక్స్ / ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ (టిసి), 2 పాస్పోర్ట్ సైజు ఫోటోలు, కుటుంబ సభ్యుల్లో ఒకరి ఓటర్ ఐడీ జిరాక్స్, మొబైల్ నంబర్ లతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. గ్రామ / వార్డు సచివాలయంలో, మీ సేవ (Mee Seva) కేంద్రంలో, NVSP పోర్టల్: www.nvsp.in లో నమోదు చేసుకొని, ఆ రసీదు, మీ ఆధారాలు స్థానిక (బి ఎల్ వో)బూతు లెవెల్ ఆఫీసర్ కు గాని, స్థానిక (వీఆర్వో) విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ కు సమర్పించాలన్నారు. వారు పరిశీలన చేసి, ఎలక్షన్ (ఆర్వో)రిటర్నింగ్ ఆఫీసర్ కు పంపిస్తారన్నారు. అప్పుడు మనకు కొత్త ఓటు వస్తుందన్నారు. మీ ఓటు - మీ హక్కు ఓటరుగా నమోదు చేసుకోండి- మన భారతదేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయండని యువతి, యువకులకు పిలుపునిచ్చారు. ఏ ఎన్నికలు జరిగినా కూడా మనదేశంలో ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకొని, మంచి నేతలు ఎన్నుకోవాలి అన్నారు.
Admin
E Nivas News