ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : శ్రీశైలం నియోజకవర్గం, ఆత్మకూరు మండలంలో మార్కెట్ యార్డ్ నందు 21 వ విడత పిఎం కిసాన్ మరియు రెండవ విడత అన్నదాత సుఖీభవ నగదు జమ కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ ఆత్మకూరు సహాయ వ్యవసాయ సంచాలకులు కే.హేమలత ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మార్కెట్ యార్డ్ చైర్మన్ వంగాల.వెంకట కృష్ణారెడ్డి హాజరు కావడం జరిగింది. వ్యవసాయ శాఖ సహాయ వ్యవసాయ సంచాలకులు హేమలత మాట్లాడుతూ నియోజకవర్గంలో 25018 మంది రైతులకు 17.08 కోట్లు, ఆత్మకూరు మండలంలో 7257 మంది రైతులకు 4.93 కోట్లు రూపాయలు నగదు జమ చెక్కును పంపిణీ చేయడం జరిగింది. అలాగే వ్యవసాయ శాఖకు సంబంధించిన పథకాలను రైతులకు వివరించి, మండలంలో అన్నదాత సుఖీభవ నగదు జమ కాని రైతులు తమ గ్రామాలలోని రైతు సేవ కేంద్రాల్లో సిబ్బందిని సంప్రదించాలని తెలిపారు. అలాగే మండల తహసిల్దార్- జి.రత్న రాధిక మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ జమకాని రైతులు అర్జీ పెట్టుకోవచని తెలిపారు. అబ్దుల్లాపురం భాష, మరియు మండల అధ్యక్షుడు రవీంద్రబాబు లు మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ పథకం రైతులకు ఎంతో తోడ్పాటు అందిస్తుందని తెలిపారు. అలాగే మాజీ మండల అధ్యక్షులు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం అందించడం రైతులకు ఒక వరంగా భావిస్తున్నారని తెలిపారు మరియు వ్యవసాయ శాఖ సిబ్బంది గ్రామాల్లో రైతులకు అందుబాటులో ఉండి యూరియా పంపిణీ పంట నష్టపరిహారం మొదలైన సేవలు అందిస్తున్నారని కొనియాడారు. అలాగే ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ప్రకృతి వ్యవసాయం యొక్క గొప్పతనాన్ని రైతులకు వివరించారు. ఉద్యానవన శాఖ అధికారి- కె.చందన ఉద్యానవన శాఖ యొక్క పథకాలను రైతులకు వివరించారు. అలాగే పట్టు పరిశ్రమ శాఖ టెక్నికల్ అసిస్టెంట్ కలామ్ పట్టు పరిశ్రమ శాఖ యొక్క పథకాలను రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ అధికారి అరుణ, ఎంపీడీవో- సయ్యద్.ఉమర్, ఇతర మండల స్థాయి అధికారులు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ తిరుపమయ్య , విఆర్ఎస్ కి చైర్మన్ మల్లికార్జున్రెడ్డి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్, బిజెపి కార్యదర్శి షబానా, ఆత్మకూరు రైతు సేవా సహకార పరపతి సంఘం చైర్మన్-షాహబుద్దీన్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు కాటంరెడ్డి ,వీరభద్రుడు, పద్మావతి , రైతు సంఘం అధ్యక్షులు తపాల్ ఆశ్రఫ్ అలీ, ఇతర ప్రజా ప్రతినిధులు, మండలంలోని వివిధ గ్రామాల రైతులు మరియు వ్యవసాయ విస్తరణ అధికారులు, గ్రామ వ్యవసాయ సహాయకులు మరియు ఎంపీఈఓ లు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News