Tuesday, 28 July 2026 06:02:26 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

లక్ష్మాపురం అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన డివిఎంసి మెంబర్ లింగాల నాగరాజు

Date : 24 June 2026 12:33 AM Views : 76

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పగిడ్యాల : నంద్యాల జిల్లా, పగిడ్యాల మండలంలోని, లక్ష్మాపురం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాలలో పాముల బెడద అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం వలన మంగళవారం డివీఎంసీ మెంబర్ లింగాల నాగరాజు ఆకస్మికంగా తనిఖీ చేసి, పాఠశాల పరిసరాలను పరిశీలించారు. అనంతరం డివిఎంసి మెంబర్ లింగాల నాగరాజు మాట్లాడుతూ చుట్టూ ప్రహరీ గోడ ఆనుకొని పిచ్చి మొక్కలు ఎక్కువగా పెరిగి పోయి వనముల తయారై పాములకు నివాస కేంద్రాలుగా మారిందని ఆయన వాపోయారు. పాములు సంచరిస్తున్నాయని, ఒకటి రెండుసార్లు పాములు సంచరించిన స్కూల్ ప్రిన్సిపాల్ ఏమాత్రం పట్టించుకోవడంలేదని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అదే మాదిరిగా దాదాపుగా 640 మంది బాలికలు ఉన్న హాస్టల్లో, 10 బాత్రూములు ఉండటం వలన వాళ్లు కాలకృత్యాలు తీర్చుకోవడంలో చాలా ఇబ్బందిగా ఉందని ఆయన అన్నారు. తక్షణమే జిల్లా ఉన్నతాధికారులు స్కూలు పరిశీలించి, వసతులతో పాటుగా ఆవరణంలో పొదలతో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించే కార్యక్రమం చేపట్టాలని, విష సర్పాల నుండి పిల్లలను కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయాలపై జిల్లా కలెక్టర్ కి స్థానిక ఎమ్మెల్యే గిత్త.జయసూర్య కి ఫిర్యాదు చేస్తానని ఆయన హెచ్చరించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :