ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పగిడ్యాల : నంద్యాల జిల్లా, పగిడ్యాల మండలంలోని, లక్ష్మాపురం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాలలో పాముల బెడద అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం వలన మంగళవారం డివీఎంసీ మెంబర్ లింగాల నాగరాజు ఆకస్మికంగా తనిఖీ చేసి, పాఠశాల పరిసరాలను పరిశీలించారు. అనంతరం డివిఎంసి మెంబర్ లింగాల నాగరాజు మాట్లాడుతూ చుట్టూ ప్రహరీ గోడ ఆనుకొని పిచ్చి మొక్కలు ఎక్కువగా పెరిగి పోయి వనముల తయారై పాములకు నివాస కేంద్రాలుగా మారిందని ఆయన వాపోయారు. పాములు సంచరిస్తున్నాయని, ఒకటి రెండుసార్లు పాములు సంచరించిన స్కూల్ ప్రిన్సిపాల్ ఏమాత్రం పట్టించుకోవడంలేదని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అదే మాదిరిగా దాదాపుగా 640 మంది బాలికలు ఉన్న హాస్టల్లో, 10 బాత్రూములు ఉండటం వలన వాళ్లు కాలకృత్యాలు తీర్చుకోవడంలో చాలా ఇబ్బందిగా ఉందని ఆయన అన్నారు. తక్షణమే జిల్లా ఉన్నతాధికారులు స్కూలు పరిశీలించి, వసతులతో పాటుగా ఆవరణంలో పొదలతో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించే కార్యక్రమం చేపట్టాలని, విష సర్పాల నుండి పిల్లలను కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయాలపై జిల్లా కలెక్టర్ కి స్థానిక ఎమ్మెల్యే గిత్త.జయసూర్య కి ఫిర్యాదు చేస్తానని ఆయన హెచ్చరించారు.
Admin
E Nivas News