ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల : క్రిష్ణగిరి మండలంలోని, కంబాలపాడు గ్రామంలో ఉన్న ఎస్సీ బాలుర వసతి గృహాన్ని ఏపీ ఈ డబ్ల్యూ ఐడీసీ రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ ఈడబ్ల్యూఐడీసీ రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని వంటగదిలోని, కూరగాయలను, వంటలను మెనూ ప్రకారం పిల్లలకు వండి పెడుతున్నారా లేదా అనేది ఆరా తీయడం జరిగింది. విద్యార్థులకు వసతిగృహంలో ఇచ్చే అలవెన్స్ ల గురించి, వారి స్టడీ గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది. హాస్టల్లో సీనియర్ విద్యార్థులు, జూనియర్ విద్యార్థులపై ర్యాగింగ్ చేయడం ఇటువంటివి లేకుండా అందరూ కలిసిమెలిసి, అన్నదమ్ములుగా చదువుకోవాలని అన్నారు. విద్యార్థి దశ నుండే క్రమశిక్షణతో, సోదర భావంతో ఉండి మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు. హాస్టల్ సిబ్బంది ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకే మెనూ ప్రకారం, స్వచ్ఛమైన కూరగాయలతో వంటలు వండి పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఏపీ ఈడబ్ల్యూఐడిసి డిఈఈ-గోన.నాగరాజు, ఏఈ కె.వెంకటరామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News