ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : మండల కేంద్రమైన పాములపాడులో కాంగ్రెస్ పార్టీ నందికొట్కూరు నియోజవర్గ ఇన్చార్జ్ తేనే.నాగరాజు, మండల అధ్యక్షుడు ఎస్.షేక్షాఅలీ ల ఆధ్వర్యంలో అఖిలభారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 140 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. సందర్భంగా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరు వేశారు. ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ చిత్ర పటానికి పూలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ తేనె నాగరాజు, ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు- డి.స్వామన్న, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎస్.షేక్షాఅలీ, తదితర నాయకులు మాట్లాడుతూ 1885 వ సంవత్సరం, డిసెంబర్-28 వ తేదీన బొంబాయి నగరంలోనీ గోకుల్ దాస్ తేజ్ పాల్ సంస్కృత కళాశాలలో మొట్ట మొదటి కాంగ్రెస్ సమావేశం బ్రిటిష్ రిటైర్డ్ ఐ సి ఎస్ అధికారి ఏవో హోమ్ ఆధ్వర్యంలో జరిగినది. ఈ సమావేశంనకు ఉమేష్ చంద్ర బెనర్జీ అధ్యక్షత వహించారని తెలిపారు. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా 72 మంది ప్రతినిధులు పాల్గొని దేశ స్వతంత్ర ము కోసం కాంగ్రెస్ పార్టీ నీ స్థాపించారని పేర్కొన్నారు. మహాత్మ గాంధీ నేతృత్వంలో 1920 లో స్వాతంత్ర పోరాటంను ప్రారంభి, కాంగ్రెస్ పార్టీ అహింసా మార్గంలో స్వాతంత్రము సాధించినదని అన్నారు. ఈ రోజు దేశం అభివృద్ధి చెందడానికి కాంగ్రెస్ పార్టీ ప్రధాన పాత్ర పోషించినదని పేర్కొన్నారు. ముఖ్యంగా తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పంచవర్ష ప్రణాళికలు అమలుచేసి దేశంలో అనేక ప్రాజెక్టులు నిర్మించి ప్రజల కోసం పాటుపడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కొనియాడారు. జై జవాన్, జై కిసాన్ నినాదంతో లాల్ బహదూర్ శాస్త్రి మరింత అభివృద్ధికి కృషి చేశారని అన్నారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ గరీబీ హటావో దేశ్ బచావో నినాదంతో పేదరిక నిర్మూలన కోసం అనేక సంక్షేమ పథకాలు చేపట్టడం జరిగిందన్నారు. మరియు బ్యాంకులను జాతీయం చేసి సామాన్యులకు అందుబాటులోకి తీసుకొని వచ్చారన్నారు. నిరుపేదలకు ఇండ్లు లేని వారికి ఇండ్లు, భూమి లేని వారికి భూములు ఇవ్వడం జరిగినదని అన్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ నేతృత్వంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీనీ అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని, పీవీ నరసింహారావు నేతృత్వంలో సరళి కృత్రిమ విధానాలు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది అన్నారు. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ నేతృత్వంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ను తీసుకుని వచ్చి 100 రోజులు పనిదినాలను తీసుకుని అందరికి పని కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీ దని, నేటి బిజేపి ప్రభుత్వం మహాత్మ గాంధీ పేరును తొలిగించడం, కేంద్ర ప్రభుత్వం 100 శాతం ఇవ్వవలసిన గ్రాంట్ ను 60 శాతం కేంద్ర వాటా,40 శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటా గా మార్చడం ద్వారా త్వరలోనే ఈ పథకాన్ని ఎత్తివేయాలని చూస్తుందని పేర్కొన్నారు. కాబట్టి దేశంలోను, రాష్ట్రంలోను కాంగ్రెస్ పార్టీ నీ తిరిగి అధికారంలోకి తీసుకుని రావాలని కోరారు. కనుక ప్రజల చేత కాంగ్రెస్ పార్టీ ని తిరిగి తీసుకొని వచ్చేవరకు కృషి చేస్తామని, బీజేపీ నుండి దేశాన్ని రక్షించుకుంటామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం నాయకులు, కార్యకర్తల భారీ కేకును కటింగ్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకొని సంబరాలు చేసుకోవడం జరిగింది. అందరికీ మిఠాయిలు పంచి పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు ఉస్మాన్ భాష, సుంకన్న గౌడు, పాములపాడు జూపాడుబంగ్లా, కొత్తపల్లి మండలాల నాయకులు అత్తావుల్లా, సికందర్, మద్దిలేటి, మనోహర్, ఇంతియాజ్, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News