ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : నంద్యాల జిల్లాకు రెగ్యులర్ సాంఘిక సంక్షేమ శాఖ అధికారిని నియమించాలని గిరిజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు జవహర్ నాయక్ ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం నాడు ఆత్మకూరు పట్టణంలో మీడియాతో గిరిజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు జవహర్ నాయక్ మాట్లాడుతూ పాఠశాలల పర్యవేక్షణ లేక, కొన్ని ఆశ్రమ పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయులు లేక గిరిజన విద్య కుంటు పడిందని, ఉపాధ్యాయుల అక్రమ డిప్యూటేషన్ లు వెంటనే రద్దు చేయాలని, ఇన్చార్జి అధికారి దివ్యాంగుడు కావడంతో అతని తమ్ముడి పెత్తనంతో పలు అక్రమాలు జరుగు తున్నాయని, కావున వెంటనే నంద్యాల జిల్లాకు రెగ్యులర్ గిరిజన సాంఘీక సంక్షేమ శాఖ అధికారిని నియమించాలని, గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేటట్లు చూడాలని అధికారులను ఆయన కోరారు.
Admin
E Nivas News