ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని, రుద్రవరం గ్రామంలో టిడిపి యువ నాయకుడు & సమాజ సేవకుడు పి.హుసేన్ భాష ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామ పెద్దలతో కలిసి ముత్యాల ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా టిడిపి యువ నాయకుడు & సమాజ సేవకుడు పి.హుసేన్ భాష మాట్లాడుతూ గ్రామంలో రాజకీయాలకతీతంగా, కుల మతాలకతీతంగా, మతసామరస్యంతో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ భాయ్ - భాయ్ అని కలిసి వెలిసి ఉండడానికి నేను అన్ని మతాల పండుగల కార్యక్రమాలకు తన వంతు సహకారాన్ని అందిస్తున్నానని అన్నారు. గ్రామంలో 14 మంది మహిళలు ఈ పోటీలో పాల్గొన్నారు. ముత్యాల ముగ్గుల పోటీలకు అనూహ్య స్పందన లభించిందన్నారు. గ్రామంలో నుంచి మహిళలు మధ్యాహ్నం 03 గంటలకే పోటీలు జరిగే దేవాలయం ప్రాంగణానికి పెద్దసంఖ్యలో మహిళలు చేరుకున్నారు.
మధ్యాహ్నం 03 గంటలకు ప్రారంభమైన పోటీలు మధ్యాహ్నం 6.30 గంటల వరకు కొనసాగాయన్నారు. కొందరు మహిళలు ఆలస్యంగా పోటీలకు హాజరైనప్పటికీ అందమైన ముగ్గులు వేయడం జరిగింది. ప్రతి ముగ్గూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని, ఉత్తమ ముగ్గులను ఎంపిక చేసేందుకు న్యాయ నిర్ణేతలు తీవ్ర కసరత్తు చేయాల్సి వచ్చిందన్నారు. సంక్రాంతి పండుగ శోభ అడుగడుగునా తాండవించిందన్నారు. ఈ ముగ్గుల పోటీలలో గెలుపొందిన శివమ్మ, విజయమ్మ, లావణ్య, స్పందన, సారిక, తదితర విజయతలకు సమాజ సేవకుడు పి.హుసేన్ భాష, గ్రామ పెద్దలతో కలిసి బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వి.రామస్వామి, మాజీ సర్పంచ్ రామసుబ్బయ్య, నారాయణ రెడ్డి, టిడిపి యువ నాయకులు పి.హుసేన్ భాష , బీజేపీ మండల అధ్యక్షులు రాయపాటి.మురళి మోహన్, ఏపీ మోడల్ స్కూల్ చైర్మన్ వేణుగోపాల్, పెద్దబి గౌడ్ , బుడ్డన్న గౌడ్, మల్లికార్జున, గ్రామ టెంపుల్ యూత్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Admin
E Nivas News