ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని, మిట్టకండాల గ్రామంలో టిడిపి మండల ప్రధాన కార్యదర్శి & మాజీ సర్పంచ్ జి.హరిప్రసాద్ యాదవ్ ఆధ్వర్యంలో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని కార్యకర్తలతో కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ మాజీ సర్పంచ్ & టిడిపి మండల ప్రధాన కార్యదర్శి జి.హరిప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో సాధించిన ప్రగతిని, ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ వెళ్లి వివరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలు తీరును, ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ 205వ బూత్ ఇన్చార్జి లింగాల శివరాముడు, తెలుగుదేశం నాయకులు నియాజ్, వి.మధు, లింగాల దేవరాజ్, సుబ్బారాయుడు, డి.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News