Thursday, 30 July 2026 04:11:14 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

వేంపెంట గ్రామంలో ఘనంగా కామ్రేడ్ చండ్ర.పుల్లారెడ్డి 41వ వర్ధంతి కార్యక్రమం

ఆయన స్తుపం దగ్గర నివాళులర్పించి, సభలో కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా పోరాడుదాం అని పిలుపునిచ్చిన ప్రజా సంఘాల నాయకులు

Date : 10 November 2025 06:40 PM Views : 290

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి 41వ వర్ధంతి సభను పాములపాడు మండలంలోని, వేంపెంట గ్రామంలో నిర్వహించడం జరిగింది. ఈ సభకు సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ నంద్యాల జిల్లా కార్యదర్శి వై.నరసింహులు అధ్యక్షత వహించారు. అనంతరం జరిగిన సభలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కామ్రేడ్ చిట్టిపాటి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వ్యవసాయాన్ని, కార్పొరేట్ కంపెనీలకు ఇస్తూ, దేశ సంపదను ఖనిజ వనరులను కార్పోరేట్ల చేతులలో పెడుతూ, రెండోవైపు కార్మికులకు పని గంటలు పెంచుతూ, పెట్టుబడిదారులకు కట్టు బానిసలను కావించే విధానాలకు వ్యతిరేకంగా పోరాడడమే మన ముందున కర్తవ్యమని ఆయన అన్నారు. ప్రతిఘటన పోరాట నిర్మాత, విప్లవోద్యమ అగ్ర నాయకులు కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి 41వ వర్ధంతి సందర్భంగా వెంపెంటలో జరిగిన సభలో అయన ఉపన్యాసించారు. కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి వెలుగోడులో జన్మించి, ఇంజనీరింగ్ విద్యను మధ్యలో వదిలేసి విప్లవొద్యమానికి అంకితం అయ్యారన్నారు.1952లో నందికొట్కూరు శాసనసభ్యులుగా రాయలసీమ కరువుకాటకాలపైన, నీటి సమస్యలపైన మద్రాస్ అసెంబ్లీలో ఏడు గంటలు సుదీర్ఘ ఉపన్యాసం చేశారన్నారు. పేద ప్రజల భూముల కోసం వారి హక్కుల కోసం పోరాడి తంగడంచ, రాపులచెరువు1000 ఎకరాలు పగిడ్యాల, లక్ష్మాపురం తదితర గ్రామాలకు పంపిణీ చేయడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. భూమి భుక్తి -విముక్తి కోసం సాయుధ పోరాటమే మార్గమని భావించి 1969 నవంబర్-9 వ తేదీన గోదావరి లోయ పరివాహక ప్రాంతంలో సాయిద దళాలు నిర్మించారు. ఆ సిద్ధాంత వెలుగులో గోదావరి లోయ ఇరువైపులా ఐదు లక్షల ఎకరాలు అటవీ భూములను ఆదివాసులు పంపిణీ చేసుకోవడంలో ఆయన కీలక భూమిక వహించారు. కర్నూలు జిల్లా కార్యదర్శిగాను, రాష్ట్ర కమిటీ సభ్యుడిగాను, కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి గాను అంచలంచలుగా ఎదిగి విప్లవొద్యమానికి నాయకత్వం వహించారు. భారత దేశంలో చీలికలు గురైన విప్లవోద్యమాన్ని ఐక్యం చేయడంలో మహత్తరమైన కృషిని కొనసాగించారని అన్నారు. దానిలో భాగంగా చర్చలకు బెంగాల్ వెళ్లి గుండెపోటుతో నవంబర్-9వ తేదీన అమరులయ్యారు. భారతదేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న తక్షణ సమస్యలను ప్రతిపాదికగా ప్రజా ఉద్యమం తీవ్రతరం చేయడమే కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి కి మనం అర్పించే నిజమైన నివాళిని కామ్రేడ్ చిట్టిపాటీ వెంకటేశ్వర్లు విప్లవ జోహార్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ టి యు రాష్ట్ర సహాయ కార్యదర్శి కే.అరుణ్ కుమార్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కర్నూలు జిల్లా కార్యదర్శి మల్లికార్జున, ఐ ఎఫ్ టి యు నంద్యాల జిల్లా అధ్యక్షులు పి.మజీద్ మియా, ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి ఎం.గోపాల్, పిడిఎస్ యు రాష్ట్ర అధ్యక్షులు భాస్కర్, పి డి ఎస్ యు నంద్యాల జిల్లా కార్యదర్శి రాంబాబు, జిల్లా నాయకులు ఆది, ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు ఆనంద్, పిడిఎస్యు నాయకులు మహేంద్ర, హమాలి వర్కర్స్ యూనియన్ నాయకులు స్వాములు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కే.గోవింద్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :