ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / వెలుగోడు : మండల కేంద్రమైన వెలుగోడులోనీ, కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం ప్రిన్సిపాల్ సుభాషిణి ఆధ్వర్యంలో, పిల్లల బంగారు భవిష్యత్ కోసం- బడి వైపు ఒక అడుగు అనే నినాదంతో తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం (మెగా పీటీయం-4.0) అత్యంత ఘనంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా, అసిస్టెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ అరుణ్ కాంత్, విద్యా కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్లు, సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మండల అసిస్టెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ అరుణ్ కాంత్, హాస్టల్ ప్రిన్సిపాల్ సుభాషిని, విద్యా కమిటీ చైర్మన్ ఉపాధ్యాయులు తదితరులు మాట్లాడుతూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమైనదని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు అన్ని రకాల మౌలిక వసతులను కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమన్వయంతో విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశం ముగిసిన అనంతరం, పాఠశాల విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి, వారి చదువుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి కూర్చొని ఎంతో ఆత్మీయంగా మధ్యాహ్న భోజనం చేశారు. భోజనం నాణ్యతను స్వయంగా పరిశీలించి, వంట ఏ విధంగా ఉందో విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఆయన స్వయంగా తమతో కలిసి భోజనం చేయడంతో విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు మరియు పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Admin
E Nivas News