ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : కర్నూలు పట్టణంలోని, కోర్టు క్లబ్ నందు జరిగిన కర్నూలు జిల్లా క్రిస్టియన్ అడ్వకేట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సెమీ క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ ఈడబ్ల్యూఐడీసీ రాష్ట్ర డైరెక్టర్- జి.నాగముని మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రపంచ క్రైస్తవులు ఏసుక్రీస్తు జన్మ సారూప్యతలను ధ్యానిస్తారన్నారు. భూమిపై పుట్టిన వారిలో అత్యంత ప్రభావంతమైన వ్యక్తులుగా ఏసుక్రీస్తును ప్రపంచ చరిత్ర గుర్తించిందన్నారు. ఇందులో ఏసుక్రీస్తు క్రైస్తవ మతానికి మూలంగానూ, దేవుడిగాను ప్రపంచం మొత్తం కొనియాడిందన్నారు. ఈ సందర్భంగా అందరికీ సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసి, అందరి జీవితాలలో సుఖ సంతోషాలు వెదజల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వరప్రసాదరావు, శ్రీధర్ రావు, మాదన్న, రఘు, వెంకటేశ్వర్లు, డానియేల్, రాజేష్, సుమంత్, రంగ రవికుమార్, బంగి సుధీర్, ప్రసాద్, ప్రేమ్ కుమార్, రవిరాజు, యాస్మిన్, బాణాల రాజు, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News