ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని, మిట్టకందాల గ్రామ సచివాలయం లో జరుగుతున్న ఎస్ఐఆర్ సర్వే ప్రక్రియను ఎంపీడీవో ఎన్.చంద్రశేఖర్, తహసిల్దార్ జి.సుభద్రమ్మ లు పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్క బిఎల్ఓ 100% ఎనుమరేషన్ ఫారంలను పూర్తిగా రిజిస్ట్రేషన్ చేయాలని అలాగే డెత్తులు కానీ, మ్యారేజ్ కానీ, షిఫ్టింగ్ పంచనామ నిర్వహించి, ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియను ఈరోజు సాయంత్రం వరకు పూర్తి చేయాలని మండల తహసిల్దార్ జి.సుభద్రమ్మ, ఎంపీడీవో చంద్రశేఖర రావు లు బిఎల్ఓ లకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తో పాటు డిప్యూటీ ఎంపీడీఓ తిరుపాలు, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ డీ.ఖాజాబీ, పంచాయతీ సెక్రటరీ యశోదమ్మ, వీఆర్వో ముర్తుజావలి, బీఎల్వోలు దివ్య, రాణాప్రతాప్ లు అలాగే నాయకులు తెలుగుదేశం పార్టీ కల్చరల్ మండల అధ్యక్షులు భావన వినోద్ కుమార్, ప్రజలు మాండ్ల చిన్న స్వామన్న, తలారి శివశంకర్ పాల్గొన్నారు.
Admin
E Nivas News