ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని, లింగాల గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ ను జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా డీవీఎంసీ మెంబర్ లింగాల నాగరాజు మాట్లాడుతూ వంట మనుషులు తాజా కూరగాయలు తెచ్చి పిల్లలకు వండి పెట్టాలని చదువుకునే విద్యార్థుల కోసం కూటమి ప్రభుత్వం నాణ్యమైన సన్న బియ్యం అందిస్తుందని పిల్లలకు మంచి భోజనం పెట్టి వాళ్ళను బాగా చూసుకోవాల్సిన బాధ్యత హెడ్మాస్టర్ దేనని ఆయన అన్నారు. భోజనం సరిగ్గా లేకుంటే పిల్లలు స్కూలుకు దూరమయ్యే ప్రమాదం ఉందని పిల్లలు డ్రాప్ అవుట్ అయితే క్షమించే పరిస్థితి లేదని ఆయన అన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే ఎమ్మెల్యే దృష్టికి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన హెచ్చరించారు. పిల్లలకు బయట కాకుండా షెడ్ లోనే భోజనం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పిల్లల విషయంలో ఏవైనా అవకతవకం జరుగుతే క్షమించే పరిస్థితి లేదని వెంటనే జిల్లా కలెక్టర్ కి స్థానిక ఎమ్మెల్యే కి ఫిర్యాదు చేస్తానని ఆయన హెచ్చరించారు.
Admin
E Nivas News