Sunday, 13 September 2026 12:57:26 AM
# శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి

జ‌ల్ జీవ‌న్ మిష‌న్ ప‌నుల‌పై ప్ర‌త్యేక దృష్టిపెట్టండి..! వేస‌వి స‌న్న‌ద్ధ‌త ప‌క‌డ్బందీగా ఉండాలి

జిల్లా క‌లెక్ట‌ర్ డాక్టర్ జి.ల‌క్ష్మీశ‌

Date : 24 February 2026 08:32 PM Views : 221

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / ఎన్టీఆర్ జిల్లా : జ‌ల్ జీవ‌న్ మిష‌న్ (జేజేఎం) ప‌నుల‌పై ప్ర‌త్యేక దృష్టిపెట్టి త్వ‌రిత‌గ‌తిన పూర్త‌య్యేలా చూసి ప‌థ‌కం ఫ‌లాలు ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యేలా కృషిచేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్టర్ జి.ల‌క్ష్మీశ అధికారుల‌ను ఆదేశించారు. మంగ‌ళ‌వారం క‌లెక్ట‌రేట్ శ్రీ పింగ‌ళి వెంక‌య్య స‌మావేశ మందిరంలో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ అధ్య‌క్ష‌త‌న జిల్లా జ‌ల‌, పారిశుద్ధ్య మిషన్ (డీడ‌బ్ల్యూఎస్ఎం) స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశంలో జ‌ల్ జీవ‌న్ మిష‌న్ - కుళాయి క‌నెక్ష‌న్లలో పురోగ‌తితో పాటు ప‌థ‌కం ప‌నితీరుపై స‌మీక్షించారు. అదేవిధంగా స్వ‌చ్ఛ‌భార‌త్ మిష‌న్ (గ్రామీణ్‌)- ఓడీఎఫ్ ప్ల‌స్‌, ఘ‌న ద్ర‌వ వ్య‌ర్థాల నిర్వ‌హ‌ణ‌, నీటి నాణ్యత పర్యవేక్షణ, నిఘా త‌దిత‌రాల‌పై చ‌ర్చించారు. ఎ.కొండూరులో మండ‌లంలోని సీకేడీ ప్ర‌భావిత ప్రాంతాల్లో ఇంటి కుళాయి క‌నెక్ష‌న్ల భౌతిక స్థితిని ప‌రిశీలించి నివేదిక స‌మ‌ర్పించాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ ఆదేశించారు. 100 శాతం క‌నెక్ష‌న్లు క‌ల్పించేందుకు డీపీవోకు ఆదేశాలిచ్చారు. గొల్ల‌మండ‌ల తండా, జ‌మ‌ల‌గ‌డ్డ‌, దీప్లాన‌గ‌ర్ ఆవాసాల‌కు అవ‌స‌ర‌మైన క్లియ‌ర్ వాట‌ర్ సంప్ నిర్మాణం పూర్తిచేసి మార్చి నాటికి తాగునీటి స‌దుపాయం క‌ల్పించాల‌న్నారు. వేస‌విలో ఎక్క‌డా తాగునీటికి కొర‌త లేకుండా ప‌క‌డ్బందీ ప్ర‌ణాళిక‌లు అమ‌లు చేసేందుకు సిద్ధంగా ఉండాల‌న్నారు. నిరంత‌ర నాణ్య‌మైన తాగునీటి స‌ర‌ఫ‌రా జ‌రిగేలా చూడాల‌న్నారు. షెడ్యూల్ ప్ర‌కారం చేతి పంపులు, బోర్‌వెల్స్ మ‌ర‌మ్మ‌తులు, పైపులైన్ల లీకేజీల నివార‌ణ‌, క‌లుషిత నివార‌ణ వంటి వాటి ప‌నులు జ‌రిగేలా చూడాల‌న్నారు. ఆరోగ్యం, విద్య, మహిళా & శిశు సంక్షేమ శాఖలతో సమన్వయం చేసుకుంటూ జిల్లాలో తాగునీటి స‌ర‌ఫ‌రా వ్య‌వ‌స్థ‌లో ఎక్క‌డా ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాల‌ని ఆదేశించారు. స్వ‌ర్ణాంధ్ర- 2047 ల‌క్ష్యాల సాధ‌న‌లో స్వ‌చ్ఛ‌మైన తాగునీటి స‌ర‌ఫ‌రా కూడా కీల‌క అంశ‌మ‌ని.. ఈ నేప‌థ్యంలో నీటి నాణ్య‌త ప‌ర్య‌వేక్ష‌ణ వ్య‌వ‌స్థ‌ను ప‌క‌డ్బందీగా అమ‌లుచేయాల‌ని స్ప‌ష్టం చేశారు. మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా నిర్దిష్ట కాల‌ప‌రిమితుల్లో నీటి వ‌న‌రుల శాంపిళ్ల‌ను ప‌రీక్షించి, ఫ‌లితాల‌ను ఆన్‌లైన్లో న‌మోదు చేయాల‌న్నారు. పీహెచ్‌, టీడీఎస్‌, హార్డ్‌నెస్‌, ఫ్లోరైడ్‌, ఐర‌న్‌, నైట్రేట్ వంటి వాటితో పాటు భౌతిక‌, ర‌సాయ‌న‌, బ్యాక్టీరియాల‌జిక‌ల్ ప‌రామితుల‌పై దృష్టిసారించాల‌న్నారు. క్లోరినేష‌న్‌తో పాటు పాఠ‌శాల‌లు, అంగ‌న్వాడీలు, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, హాస్ట‌ళ్లు వంటి వాటిలో ట్యాంకుల శుద్ధి స‌రైన విధంగా జ‌రిగేలా స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారుల ప‌ర్య‌వేక్ష‌ణ ఉండాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ స్ప‌ష్టం చేశారు. ఈ సమావేశంలో జెడ్‌పీ సీఈవో కె.క‌న్న‌మ‌నాయుడు, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా ఎస్ఈ ఎ.రామ‌కృష్ణారావు, డీపీవో పి.లావ‌ణ్య‌కుమారి, డ్వామా పీడీ ఎ.రాము, వ్య‌వ‌సాయ అధికారి డీఎంఎఫ్ విజ‌య‌కుమారి, విద్య‌, వైద్యం, ఐసీడీఎస్ త‌దిత‌ర శాఖ‌ల అధికారులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :