ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : భవిష్యత్తు తరాల ఆరోగ్య రక్షణ కోసం కూటమి ప్రభుత్వం చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని తల్లిదండ్రులు వినియోగించుకోని, తమ పిల్లలకు తప్పనిసరిగా చుక్కలు వేయించాలని సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దీన్ అన్నారు. ఆదివారం ఆత్మకూరు ఏరియా ఆసుపత్రిలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని సింగిల్ విండో చైర్మన్ ఏ.షహాబుద్దీన్, హాస్పిటల్ సూపరిండెంట్ డాక్టర్ ఏ.రాయుడు, పట్టణ టిడిపి అధ్యక్షులు జె.వేణుగోపాల్ ల కలిసి ప్రారంభించి, చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ చిరంజీవి, స్టాఫ్ నర్స్ అరుణ, వైద్య సిబ్బంది, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Admin
E Nivas News