ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండల కేంద్రంలో ఉన్నటువంటి భారత్ పెట్రోల్ బంకును జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు ఆకస్మికంగా తనిఖీ చేసి ఈ సందర్భంగా మాట్లాడుతూ డీజిల్ పెట్రోల్ కొరత లేదని ప్రజలు వినియోదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి పుకార్లను నమ్మి ప్రజలు వినియోగదారులు అవసరానికి మించి పెట్రోల్ డీజిల్ కొనుగోలు చేయడం వల్ల కొరత ఏర్పడుతుందని ఆయన అన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని పెట్రోల్ బంకుల యజమానులు ప్రజలు వినియోగదారులు ఇబ్బంది పడకుండా సకాలంలో, సక్రమంగా నిరంతరాయం డీజిల్ పెట్రోల్ పంపిణీ చేయాలని సూచించారు. పెట్రోల్ డీజిల్ కోసం వచ్చిన వారికి నిర్వహకులు ఎలాంటి కొరత లేదన్న విషయాన్ని వివరించాలని పెట్రోలు, డీజిల్ పుష్కలంగా ఉందని ప్రజలకు చెప్పాలని, ఎలాంటి అవకతవకులు జరిగిన సహించేది లేదని ఆయన అన్నారు. ప్రభుత్వం ప్రజలకు అనుగుణంగా పనిచేస్తుందని ప్రభుత్వానికి చెడ్డపేరు లేకుండా చేయాలని ఆయన అన్నారు.
Admin
E Nivas News