Wednesday, 29 July 2026 06:39:00 PM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

పాములపాడులో ఘనంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 105వ జయంతి వేడుకలు

Date : 14 February 2026 09:55 PM Views : 208

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి దళిత తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదరం సంజీవయ్య 105వ జయంతిని పాములపాడులోని, సిపిఎం పార్టీ కార్యాలయంలో, మాల మహానాడు రాయలసీమ అధ్యక్షులు కలబండి.అంకన్న ఆధ్వర్యంలో డివిఎంసి మెంబర్ లింగాల నాగరాజు, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి డి.స్వామన్న, సిఐటియు మండల కార్యదర్శి మేకల రాజు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎస్.షేక్షాఅలీ, బీసీ సంఘం నాయకుడు జి.సాయి కృష్ణ, రజక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వి.రామకృష్ణుడు, తదితర సంఘాల నాయకులు కలిసి సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరీ కమిటీ మెంబర్ లింగాల.నాగరాజు, మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు కలబండి.అంకన్న, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి- డి.స్వామన్న, సిఐటియు మండల కార్యదర్శి మేకల.రాజు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎస్.షేక్షాఅలీ, తదితర నాయకులు మాట్లాడుతూ దేశంలో దళిత తొలి ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రానికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. ఎన్నో రాజకీయ పదవులు చేపట్టి అనుభవించినప్పటికీ నిస్వార్ధంగా, నిజాయితీగా, నిరాడంబరంగా జీవించారన్నారు. అంతే కాకుండా ఏఐసీసీ జాతీయ ఉపాధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా పనిచేశారని గుర్తు చేశారు. ఆయన చేసిన సేవలకు గుర్తుగా కర్నూలు జిల్లాలోని, పెద్దపాడు గ్రామంలో విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎస్.షేక్షాఅలి, రజక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వి.రామకృష్ణుడు, ఆటో కార్మిక సంఘం నాయకులు నాగేశ్వరుడు, మల్లికార్జున, బీసీ సంఘం నాయకులు- జి.సాయికృష్ణ సోషల్ మీడియా ప్రతినిధులు గోవిందు డక్క.శ్రీకాంత్, ఎస్.షర్ఫద్దీన్ అలి, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: