ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / అనంతపురం : ఎన్ హెచ్340సి జాతీయ రహదారి నిర్మాణంలో పాత బస్సు షెల్టర్ ను తొలగించడంతో జూటూరు, కోల్సు ఆనందపురం గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, షెల్టర్ ను తిరిగి నిర్మించాలని ఆదివారం రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. పాములపాడు మండలంలోని, జూటూరు గ్రామానికి వెళ్లే దారికి ఎదురుగా ఉన్న ఎన్ హెచ్ 340సి జాతీయ రహదారిపై గతంలో ఉన్న పాత బస్సు షెల్టర్ ను రోడ్డు విస్తరణ పనులలో హైవే అధికారులు తొలగించారు. గ్రామం రహదారికి అర కిలోమీటర్ దూరంలో ఉండటంతో, బస్సు కోసం వచ్చే ప్రయాణికులు ఎండలో, వర్షంలో నిలబడాల్సిన పరిస్థితి ఉందన్నారు. నిలవడానికి కనీస సౌకర్యం లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యార్థులు, మహిళల అవస్థలు జూటూరు, కోల్స్ ఆనందాపురం గ్రామాల నుంచి దాదాపు 50 మందికి పైగా విద్యార్థులు వెళ్లి ఆత్మకూరు, నందికొట్కూరు, పాములపాడు పట్టణాలలో చదువుకుంటున్నారు. బస్సు కోసం రోడ్డుపైనే గంటల తరబడి నిలబడాల్సి వస్తోందన్నారు. రాత్రి వేళల్లో బస్సు కోసం వేచి ఉండే మహిళలు, వృద్ధులకు భద్రత కరువైందనీ, షెల్టర్ లేకపోవడంతో భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి జూటూరు గ్రామానికి కొత్త బస్సు షెల్టర్ ను నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ప్రజలతో కలిసి మరింత భారీ ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామ యువ శక్తి సంఘం నాయకులు పెద్దన్న, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News