Tuesday, 28 July 2026 07:39:08 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

జూటూరు గ్రామం వద్ద హైవేపై బస్సుషెల్టర్ కట్టాలని కోరుతూ రాస్తారోకో చేసిన ప్రజలు

ఎన్ హెచ్340సి రహదారి నిర్మాణంలో షెల్టర్ తొలగింపుతో - విద్యార్థులు, మహిళల అవస్థలు

Date : 12 July 2026 08:51 PM Views : 188

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / అనంతపురం : ఎన్ హెచ్340సి జాతీయ రహదారి నిర్మాణంలో పాత బస్సు షెల్టర్ ను తొలగించడంతో జూటూరు, కోల్సు ఆనందపురం గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, షెల్టర్ ను తిరిగి నిర్మించాలని ఆదివారం రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. పాములపాడు మండలంలోని, జూటూరు గ్రామానికి వెళ్లే దారికి ఎదురుగా ఉన్న ఎన్ హెచ్ 340సి జాతీయ రహదారిపై గతంలో ఉన్న పాత బస్సు షెల్టర్ ను రోడ్డు విస్తరణ పనులలో హైవే అధికారులు తొలగించారు. గ్రామం రహదారికి అర కిలోమీటర్ దూరంలో ఉండటంతో, బస్సు కోసం వచ్చే ప్రయాణికులు ఎండలో, వర్షంలో నిలబడాల్సిన పరిస్థితి ఉందన్నారు. నిలవడానికి కనీస సౌకర్యం లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యార్థులు, మహిళల అవస్థలు జూటూరు, కోల్స్ ఆనందాపురం గ్రామాల నుంచి దాదాపు 50 మందికి పైగా విద్యార్థులు వెళ్లి ఆత్మకూరు, నందికొట్కూరు, పాములపాడు పట్టణాలలో చదువుకుంటున్నారు. బస్సు కోసం రోడ్డుపైనే గంటల తరబడి నిలబడాల్సి వస్తోందన్నారు. రాత్రి వేళల్లో బస్సు కోసం వేచి ఉండే మహిళలు, వృద్ధులకు భద్రత కరువైందనీ, షెల్టర్ లేకపోవడంతో భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి జూటూరు గ్రామానికి కొత్త బస్సు షెల్టర్ ను నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ప్రజలతో కలిసి మరింత భారీ ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామ యువ శక్తి సంఘం నాయకులు పెద్దన్న, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: