ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : బీసీల హక్కుల సాధన కోసం ఢిల్లీలోని, జంతర్ మంతర్ వద్ద చేపట్టే 'హలో బీసీ,- చలో ఢిల్లీ' పోరుగర్జనను విజయవంతం చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు రాయపాటి మురళీమోహన్ పిలుపునిచ్చారు. మండల కేంద్రమైన పాములపాడులోని, మహాత్మ జ్యోతిరావు పూలే సర్కిల్ నందు హలో బీసీ -చలో ఢిల్లీ కార్యక్రమం కరపత్రాలు జాతీయ బీసీల రాష్ట్ర కార్యదర్శి సంజన్న, రాష్ట్ర ప్రచార కార్యదర్శి వేంపెంట రాంబాబు, జిల్లా ఉపాధ్యక్షులు కుమ్మరి రామకృష్ణ, జిల్లా కార్యదర్శి ఆర్.ఎస్.ఆర్. గోపాల్, మండల అధ్యక్షుడు రాయపాటి మురళీమోహన్, బీసీ ఉద్యోగుల సంఘం నాయకులు ఉప్పరి శివన్న, కమిటీ సభ్యులు రామ్మోహన్, తదితర నాయకులు కలిసి విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 27, 28 వ తేదీలలో ఢిల్లీలోని, జంతర్ - మంతర్ దగ్గర దీక్ష, 27వ తేదీన సెమినార్ ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. అనంతరం రాష్ట్ర కార్యదర్శి సంజన్న మాట్లాడుతూ జంతువులకు, కుక్కలకు, సింహాలకు, నక్కలకు లెక్కలు ఉన్నాయి కానీ, దేశంలో మెజార్టీ ప్రజలైన బీసీల లెక్కలు తేల్చక పోవడం శోచనీయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో కులగనణ చేపట్టి, ఎవరి జనాభా ఎంత వారికంతా విద్యా, ఉద్యోగ రాజకీయ రంగాల్లో వాటాలు కల్పించాలని అయన కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రచార కార్యదర్శి వేంపెంట రాంబాబు, జిల్లా ఉపాధ్యక్షులు కుమ్మరి రామకృష్ణ, బీసీ ఉద్యోగుల సంఘం నాయకులు ఉప్పరి శివన్న, జాతీయ బీసీ సంఘం జిల్లా కార్యదర్శి ఆర్.ఎస్.ఆర్.గోపాల్, మండల కమిటీ సభ్యులు రామ్మోహన్, సురేష్, బిసి కుల సంఘం నాయకులు పాల్గొన్నారు.
Admin
E Nivas News