Thursday, 30 July 2026 01:19:37 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

హలో బి.సి-చలో ఢిల్లీ" పోరుగర్జనను విజయవంతం చేద్దాం

జాతీయ బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు రాయపాటి మురళీమోహన్

Date : 07 July 2026 10:47 PM Views : 50

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : బీసీల హక్కుల సాధన కోసం ఢిల్లీలోని, జంతర్ మంతర్ వద్ద చేపట్టే 'హలో బీసీ,- చలో ఢిల్లీ' పోరుగర్జనను విజయవంతం చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు రాయపాటి మురళీమోహన్ పిలుపునిచ్చారు. మండల కేంద్రమైన పాములపాడులోని, మహాత్మ జ్యోతిరావు పూలే సర్కిల్ నందు హలో బీసీ -చలో ఢిల్లీ కార్యక్రమం కరపత్రాలు జాతీయ బీసీల రాష్ట్ర కార్యదర్శి సంజన్న, రాష్ట్ర ప్రచార కార్యదర్శి వేంపెంట రాంబాబు, జిల్లా ఉపాధ్యక్షులు కుమ్మరి రామకృష్ణ, జిల్లా కార్యదర్శి ఆర్.ఎస్.ఆర్. గోపాల్, మండల అధ్యక్షుడు రాయపాటి మురళీమోహన్, బీసీ ఉద్యోగుల సంఘం నాయకులు ఉప్పరి శివన్న, కమిటీ సభ్యులు రామ్మోహన్, తదితర నాయకులు కలిసి విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 27, 28 వ తేదీలలో ఢిల్లీలోని, జంతర్ - మంతర్ దగ్గర దీక్ష, 27వ తేదీన సెమినార్ ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. అనంతరం రాష్ట్ర కార్యదర్శి సంజన్న మాట్లాడుతూ జంతువులకు, కుక్కలకు, సింహాలకు, నక్కలకు లెక్కలు ఉన్నాయి కానీ, దేశంలో మెజార్టీ ప్రజలైన బీసీల లెక్కలు తేల్చక పోవడం శోచనీయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో కులగనణ చేపట్టి, ఎవరి జనాభా ఎంత వారికంతా విద్యా, ఉద్యోగ రాజకీయ రంగాల్లో వాటాలు కల్పించాలని అయన కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రచార కార్యదర్శి వేంపెంట రాంబాబు, జిల్లా ఉపాధ్యక్షులు కుమ్మరి రామకృష్ణ, బీసీ ఉద్యోగుల సంఘం నాయకులు ఉప్పరి శివన్న, జాతీయ బీసీ సంఘం జిల్లా కార్యదర్శి ఆర్.ఎస్.ఆర్.గోపాల్, మండల కమిటీ సభ్యులు రామ్మోహన్, సురేష్, బిసి కుల సంఘం నాయకులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :