Saturday, 12 September 2026 09:39:42 PM
# శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి

విద్యకు ప్రాధాన్యత -అభివృద్ధికి పెద్దపీట:- ఎమ్మెల్యే గిత్త.జయసూర్య

Date : 31 August 2026 10:22 PM Views : 92

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : మండలంలోని,రుద్రవరం గ్రామంలో నూతనంగా నిర్మించబోయే పాఠశాల భవనానికి నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త.జయసూర్య, ప్రభుత్వ అధికారులతో, నాయకులతో కలిసి భూమి పూజ నిర్వహించి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిత్త.జయసూర్య మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించి, నాణ్యమైన విద్యకు అనుకూలమైన వాతావరణం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. *అనంతరం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య కు ఆరోగ్య ఉప కేంద్రానికి స్థలాన్ని కేటాయించాలని కోరుతూ* హెల్త్ సూపర్వైజర్ రత్నమ్మ, ఎమ్ ఎల్ హెచ్.పి- కే.జీ.మమత, ఏఎన్ఎం కే.కృష్ణవేణమ్మ, ఆశ వర్కర్లు ఎం.లక్ష్మీదేవి, కే.సుధారాణి లు వినతి పత్రం సమర్పించడం జరిగింది. *ఇంటింటికి కూటమి ప్రభుత్వం రెండేళ్ల సంక్షేమ పాలన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య* పాములపాడు మండలంలోని, రుద్రవరం గ్రామంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త.జయసూర్య, ప్రభుత్వ అధికారులతో, నాయకులతో కలిసి డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిత్త.జయసూర్య, నాయకులు, అధికారులతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రజాహిత సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు నియోజవర్గ టిడిపి అబ్జర్వర్ జి.వెంకట శివుడు యాదవ్, టిడిపి మండల కన్వీనర్ రవీంద్రారెడ్డి, భానుముక్కల బండ్లమూరి వెంకటేశ్వరరావు, మద్దూరు జి.తిమ్మరెడ్డి , ఎర్ర గూడూరు చెల్లె.హరినాథ్ రెడ్డి, శివ శంకర స్వామి, పాములపాడు సొసైటీ చైర్మన్ సి.గోవిందు, ఎంపీటీసీ రాచపూడి అరుణ, తెలుగు యువత మండల అధ్యక్షుడు షేక్.కరీం భాషా, నాయకులు రాచపూడి సురేష్ (అడ్వకేట్), టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం.మోహన్ గౌడు, టిడిపి పాములపాడు మండల కల్చరల్ అధ్యక్షుడు భావన వినోద్ కుమార్, జూటూరు హఫీజ్, నాయిని కృష్ణ, రుద్రవరం మధుసూదన్ రెడ్డి, స్కూల్ కమిటీ చైర్మన్ కరిముల్లా, నాగయ్య, శ్రీనివాసులు, చిన్న వెంకటసుబ్బయ్య, షాలు, అల్లా బకాష్, నాగరాజు, రవీంద్ర, నరేష్, గోవిందు, చిన్న బాబుసా, ఇంతియాజ్, షేక్.రఫీ, షేక్.హుస్సేనాలం, ఉస్మాన్ భాష, మహబూబ్ బాషా, రహంతుల్లా, వాజిద్, రమణయ్య, ప్రభుత్వ అధికారులు ఎంఈఓ-1 బాలాజీ నాయక్, తహసిల్దార్ జి.సుభద్రమ్మ, ఎస్ఐ- పి.తిరుపాలు, ఇన్చార్జి ఎంపీడీవో- సులోచన, విబిజి రాంజీ పథకం ఏపీఓ- బి.జయంతి, ఐకెపి ఎపిఎం- ఏ.ఉమామహేశ్వరి, ఆర్డబ్ల్యూఎస్ జేఈ-సువర్చల, రెవెన్యూ ఇన్స్పెక్టర్ డి.ఖాజాబీ, ఎమ్మెల్యే గవర్నమెంట్ పిఏ- రవీంద్ర, కానిస్టేబుళ్లు ఎం.టావేశ్వరుడు, ఎన్.ఎం.కె.చౌదరి, తదితర ప్రభుత్వ శాఖల అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :