ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : శ్రీశైలం శాసనసభ్యులు బుడ్డా రాజశేఖరరెడ్డి ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే పొలం పిలుస్తుంది రా కార్యక్రమం ఆత్మకూరు అగ్రికల్చర్ కార్యాలయం నందు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆత్మకూరు సింగిల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ ఏ.షహాబుద్దిన్ రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్క రైతు పంట నమోదు చేసుకోవాలని అదేవిధంగా పంటను ఇన్సూరెన్స్ చేసుకుంటే రైతులకు మేలు జరుగుతుందన్నారు. సమావేశానంతరం రైతులకు మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ లు లలితమ్మ, సతీష్, మహేష్, రాజశేఖర్, ఎంపిఇఓ ముర్తుజావలి, రైతు సంఘం నాయకులు టపాల్ అష్రఫ్ అలీ, టిడిపి నాయకులు సుబ్బరాజు రైతులు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News