ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : మండల కేంద్రమైన పాములపాడులో, భవనాసి వాగులో ఉపాధి హామీ పనిచేస్తూ పాము కాటుకు గురైన శ్రామికురాలు గ్రంధివేముల.రవణమ్మ, భర్త వెంకటస్వామి ల ఇంటి దగ్గరకు ఎంపీడీవో- ఎన్.చంద్రశేఖర్, ఏపీవో- బి.జయంతి, డివిఎంసి మెంబర్ లింగాల నాగరాజు, ఈసీ, టీఏలు, ఎఫ్ఎ లు వెళ్లి పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం నందు (మేజర్ కెనాల్) భవనాసి వాగులో పూడికతీత పనులు చేస్తుండగా జి.రవణమ్మ- వెంకటస్వామి అనె శ్రామికురాలికి పాముకాటు వేయడం జరిగింది. ఆమెకు తక్షణమే ప్రాథమిక చికిత్స అందించారు. ప్రస్తుతము ఆమెకు ఎటువంటి ప్రమాదం లేదని త్వరగా కోలుకుంటుందని అన్నారు. ఆమెకు, కుటుంబ సభ్యులకు ధైర్యంగా ఉండాలని, ఏమి కాదు అని, ఏమైనా అవసరమైతే మెరుగైన వైద్యము అందిస్తామని అన్నారు. కనుక మండలంలోని, అన్ని గ్రామాలలో పనిచేస్తున్న ఉపాధి హామీ శ్రామికులు విష సర్పాల బారిన పడకుండా, ఎటువంటి ప్రమాదాలకు గురి కాకుండా జాగ్రత్తగా పనులు చేయాలని సూచనలు, సలహాలు ఇచ్చారు. ఏదైనా అనుకోకుండా ఎటువంటి ప్రమాదాలు జరిగినా కూడా ప్రభుత్వం నుండి ఇన్సూరెన్స్ వచ్చే విధంగా చూస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ సిబ్బంది ఈసీ ఎం.గౌస్, టి.ఏ లు స్వాములు, ఫయాజ్, శ్రీకాంత్ ఫీల్డ్ అసిస్టెంట్ జె.లింగస్వామి, ఉపాధి హామీ మెట్లు, కూలీలు పాల్గొన్నారు.
Admin
E Nivas News