ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : భారతీయ జనతా పార్టీ చేపట్టిన "మన ఊరు–మన జెండా" కార్యక్రమంలో భాగంగా పాములపాడు మండలంలోని, మిట్టకందాల, పాములపాడు, రుద్రవరం, లింగాల గ్రామాలలో బీజేపీ జెండాలను జిల్లా అధ్యక్షులు డా. అభిరుచి మధు, నాయకులతో కలిసి ఆవిష్కరించడం జరిగింది. ఈ జెండా ఆవిష్కరణ గ్రామాల్లో కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. బిజెపి పార్టీ మండల అధ్యక్షులు రాయపాటి మురళీమోహన్, అసెంబ్లీ కన్వీనర్ చల్లా దామోదర్ రెడ్డి ల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి పార్థసారథి, కో-ఇన్చార్జి కాశీ విశ్వనాథ్ పాల్గొన్నారు. అనంతరం పాములపాడులోని, బీజేపీ మండల కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో యువకులు పాములపాడులో మండల బిజెపి కార్యాలయంలో భారీ సంఖ్యలో యువకులు, కలబండి గోపాల్, రవికుమార్, కలబండి నాగన్న, సంజన, భూషన్న, కురుబన్న, రాఘవేంద్ర నాయక్, శివకుమార్, రఘురాం, సూర్యం, మహిళలు పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై బీజేపీలో చేరారు. వారికి జిల్లా అధ్యక్షులు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా డా. అభిరుచి మధు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రతిష్ఠను పెంచిన పార్టీ బీజేపీ అని అన్నారు. కరోనా సమయంలో అనేక దేశాలకు వ్యాక్సిన్లు అందించి భారతదేశాన్ని ప్రపంచానికి ఆదర్శంగా నిలిపిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే "మన ఊరు–మన జెండా" కార్యక్రమం లక్ష్యమని తెలిపారు. మండలంలోని, అన్ని గ్రామాలలో బిజెపి పార్టీ జెండా ఎగరవేసి బీజేపీ సిద్ధాంతాలను ప్రజలకు చేరవేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు శంకర్ గౌడ్, రవికుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శులు చంద్రశేఖర్, కిరణ్, కార్యాలయ కార్యదర్శి ఎర్రమల, గోపాలకృష్ణయ్య, ప్రవీణ్ కుమార్, మాజీ మండల అధ్యక్షులు సాంబశివరావు, యువ మోర్చా అధ్యక్షులు వెంకటేష్, కావ్య రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
E Nivas News