Tuesday, 28 July 2026 06:02:23 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

ప్రతి గ్రామంలో పార్టీ జెండా ఎగరవేస్తాం :- డా.అభిరుచి మధు(బిజెపి జిల్లా అధ్యక్షుడు)

పాములపాడు, మిట్టకందాల, రుద్రవరం, లింగాల గ్రామాలలో బీజేపీ జెండాల ఆవిష్కరణ...! భారీగా పార్టీలో చేరిన యువత, మహిళలు

Date : 14 July 2026 09:44 PM Views : 49

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : భారతీయ జనతా పార్టీ చేపట్టిన "మన ఊరు–మన జెండా" కార్యక్రమంలో భాగంగా పాములపాడు మండలంలోని, మిట్టకందాల, పాములపాడు, రుద్రవరం, లింగాల గ్రామాలలో బీజేపీ జెండాలను జిల్లా అధ్యక్షులు డా. అభిరుచి మధు, నాయకులతో కలిసి ఆవిష్కరించడం జరిగింది. ఈ జెండా ఆవిష్కరణ గ్రామాల్లో కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. బిజెపి పార్టీ మండల అధ్యక్షులు రాయపాటి మురళీమోహన్, అసెంబ్లీ కన్వీనర్ చల్లా దామోదర్ రెడ్డి ల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి పార్థసారథి, కో-ఇన్‌చార్జి కాశీ విశ్వనాథ్ పాల్గొన్నారు. అనంతరం పాములపాడులోని, బీజేపీ మండల కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో యువకులు పాములపాడులో మండల బిజెపి కార్యాలయంలో భారీ సంఖ్యలో యువకులు, కలబండి గోపాల్, రవికుమార్, కలబండి నాగన్న, సంజన, భూషన్న, కురుబన్న, రాఘవేంద్ర నాయక్, శివకుమార్, రఘురాం, సూర్యం, మహిళలు పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై బీజేపీలో చేరారు. వారికి జిల్లా అధ్యక్షులు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా డా. అభిరుచి మధు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రతిష్ఠను పెంచిన పార్టీ బీజేపీ అని అన్నారు. కరోనా సమయంలో అనేక దేశాలకు వ్యాక్సిన్లు అందించి భారతదేశాన్ని ప్రపంచానికి ఆదర్శంగా నిలిపిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే "మన ఊరు–మన జెండా" కార్యక్రమం లక్ష్యమని తెలిపారు. మండలంలోని, అన్ని గ్రామాలలో బిజెపి పార్టీ జెండా ఎగరవేసి బీజేపీ సిద్ధాంతాలను ప్రజలకు చేరవేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు శంకర్ గౌడ్, రవికుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శులు చంద్రశేఖర్, కిరణ్, కార్యాలయ కార్యదర్శి ఎర్రమల, గోపాలకృష్ణయ్య, ప్రవీణ్ కుమార్, మాజీ మండల అధ్యక్షులు సాంబశివరావు, యువ మోర్చా అధ్యక్షులు వెంకటేష్, కావ్య రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :