ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని, వేంపెంట గ్రామంలోని, మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు జరిగిన మెగా పేరంట్ -టీచర్స్ మీటింగ్ (పిటిఎం-4.0) లలో వేంపెంట మాజీ సర్పంచ్, టిడిపి గ్రామ అధ్యక్షులు టేకూరి.రామసుబ్బమ్మ ముఖ్యఅతిథిగా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వేంపెంట మాజీ గ్రామ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ వరుసగా రెండో ఏడాది కూడా విద్యార్థుల భవిష్యత్తు కోసం, వారి విద్యను నిరంతరం కొనసాగించడానికి తల్లికి వందనం డబ్బులు సకాలంలో విడుదల చేసి, తల్లుల బ్యాంక్ అకౌంట్ లలో జమా చేసి మానవత్వాన్ని చాటారన్నారు. పేద పిల్లల ఆకలిని తీర్చడానికి ప్రతి పాఠశాలలలో, కాలేజీలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద మీ పిల్లలకు అందిస్తున్న శ్రేష్టమైన పౌష్టికి ఆహారాన్ని తిని బాగా చదువుకోవాలన్నారు. కనుక మనమందరము విద్య వ్యవస్థను తీర్చిదిద్దడంలో భాగస్వాములం అవుదామని, మన పిల్లలకు ఉజ్వల భవిష్యత్తును ఇద్దామని పిలుపునిచ్చారు.
అనంతరం ఉపాధ్యాయులతో, తల్లిదండ్రులతో, నాయకులతో కలిసి ఆయా పాఠశాలల ఆవరణలో పర్యావరణ పరిరక్షణ కొరకు మొక్కలు నాటి నీళ్ళు పోయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బోనాల నాగ లక్ష్మమ్మ, స్కూల్ చైర్మన్ సురేష్, వైస్ చైర్మన్ దాసరి సాలమ్మ, మాజీ ఉప సర్పంచ్ బోనపల్లె సత్యరాజు, మాజీ ఎంపీటీసీ శివకుమార్, బూత్ కన్వీనర్ బోనపల్లె వినయ్ కుమార్, జనసేన శేషు, సుబ్బారావు, నెంబర్ లక్ష్మన్న, రత్నాకర్, నారాయణ, బో నాల శ్యామ్, తల్లితండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News