Tuesday, 28 July 2026 04:37:59 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

మన పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి-వారి భవిష్యత్తుకు పూలబాట వేద్దాం

టేకూరి.రామసుబ్బమ్మ(మాజీ సర్పంచ్)

Date : 24 July 2026 10:25 PM Views : 36

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని, వేంపెంట గ్రామంలోని, మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు జరిగిన మెగా పేరంట్ -టీచర్స్ మీటింగ్ (పిటిఎం-4.0) లలో వేంపెంట మాజీ సర్పంచ్, టిడిపి గ్రామ అధ్యక్షులు టేకూరి.రామసుబ్బమ్మ ముఖ్యఅతిథిగా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వేంపెంట మాజీ గ్రామ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ వరుసగా రెండో ఏడాది కూడా విద్యార్థుల భవిష్యత్తు కోసం, వారి విద్యను నిరంతరం కొనసాగించడానికి తల్లికి వందనం డబ్బులు సకాలంలో విడుదల చేసి, తల్లుల బ్యాంక్ అకౌంట్ లలో జమా చేసి మానవత్వాన్ని చాటారన్నారు. పేద పిల్లల ఆకలిని తీర్చడానికి ప్రతి పాఠశాలలలో, కాలేజీలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద మీ పిల్లలకు అందిస్తున్న శ్రేష్టమైన పౌష్టికి ఆహారాన్ని తిని బాగా చదువుకోవాలన్నారు. కనుక మనమందరము విద్య వ్యవస్థను తీర్చిదిద్దడంలో భాగస్వాములం అవుదామని, మన పిల్లలకు ఉజ్వల భవిష్యత్తును ఇద్దామని పిలుపునిచ్చారు.

అనంతరం ఉపాధ్యాయులతో, తల్లిదండ్రులతో, నాయకులతో కలిసి ఆయా పాఠశాలల ఆవరణలో పర్యావరణ పరిరక్షణ కొరకు మొక్కలు నాటి నీళ్ళు పోయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బోనాల నాగ లక్ష్మమ్మ, స్కూల్ చైర్మన్ సురేష్, వైస్ చైర్మన్ దాసరి సాలమ్మ, మాజీ ఉప సర్పంచ్ బోనపల్లె సత్యరాజు, మాజీ ఎంపీటీసీ శివకుమార్, బూత్ కన్వీనర్ బోనపల్లె వినయ్ కుమార్, జనసేన శేషు, సుబ్బారావు, నెంబర్ లక్ష్మన్న, రత్నాకర్, నారాయణ, బో నాల శ్యామ్, తల్లితండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: