ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని, వేంపెంట గ్రామంలో దేశ పోరాటం తెలుగు దినపత్రిక క్యాలెండర్లను సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు డాక్టర్ టేకూరి.నాగేశ్వరరావు తరపున మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ, గ్రామ నాయకులు నీటి సంఘం వైస్ ప్రెసిడెంట్ (డీసీ) ఆల్ఫ్రైడ్, బూత్ కన్వీనర్ బోనపల్లె వినయ్ కుమార్, వేమారెడ్డి, టేకూరి భాస్కర్, బోనాల భాస్కర్, మద్దూరు ప్రసాద్, రత్నాకర్, మహానంది, నాగేశ్వర నాయక్, కిరణ్, జనసేన శేషు, శ్రీధర్, తాటిపాటి నాయుడు, బోనపల్లె సురేష్, మొగిలి శ్రీను, పక్కిరయ్య, చిన్న హుసన్నయ్య, సుబ్బారాయుడు, హుస్సేన్ భాష తదితరులతో కలిసి విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భముగా గ్రామ మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ మాట్లాడుతూ దేశ స్వాతంత్రం రాకముందు నుండి వార్తాపత్రికలు మారుమూల ప్రాంతాల నుండి ప్రపంచ దేశాల వరకు ప్రతి సమాచారాన్ని ప్రజలకు చేరవస్తాయన్నారు. దేశ స్వాతంత్ర ఉద్యమంలో కూడా వార్త పత్రికలు ప్రముఖ పాత్ర పోషించాయన్నారు. ఏ వ్యక్తి గొప్ప వ్యక్తి కావాలంటే, పై స్థాయికి ఎదగాలంటే పత్రికలే కీలకమన్నారు. ఎక్కడ అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, విపత్తులు ఏమి జరిగినా కూడా ప్రతి సమాచారం ఈ వార్త పత్రికల ద్వారానే తెలుసుకుంటున్నామన్నారు. కనుక ప్రతి ఒక్కరూ వార్తా పత్రికలను ఆదరించాలని అప్పుడు అవి మన అభివృద్ధికి పూల బాటలు వేస్తాయని అన్నారు.
Admin
E Nivas News