Tuesday, 28 July 2026 06:02:28 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

పాములపాడులో విబి జి రామ్ జీ పథకానికి శ్రీకారం చుట్టిన నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త.జయసూర్య

Date : 02 July 2026 08:40 PM Views : 127

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : మండల కేంద్రమైన పాములపాడులోని, రైతు భరోసా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘వికసిత్ భారత్ గ్రామ అభియాన్ (విభి జీ–రామ్–జీ)’ కార్యక్రమాన్ని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త.జయసూర్య, అధికారులు, కూటమి నాయకులతో కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిత్త.జయసూర్య వికసిత్ భారత్- గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ అండ్ అజీవిక మిషన్ 125 రోజుల ఉపాధి హామీ సీఎం చంద్రబాబు నాయుడు నిర్వహించిన లైవ్ టెలికాస్ట్ కార్యక్రమంలో అధికారులతో కలిసి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధే దేశ ప్రగతికి అసలైన బలమని పేర్కొంటూ గ్రామాల్లో సంక్షేమం, మౌలిక సదుపాయాల విస్తరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. గ్రామీణ భారతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నాయని తెలిపారు. గ్రామాల్లో ఉపాధి అవకాశాల పెంపు, తాగునీరు, రహదారులు, విద్యుత్, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతుల కల్పనతో పాటు అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు చేరవేయడమే వికసిత్ భారత్ గ్రామ అభియాన్ ప్రధాన లక్ష్యమని వివరించారు. నందికొట్కూరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామం అభివృద్ధి బాటలో పయనించేలా తాను నిరంతరం కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి, వాటికి శాశ్వత పరిష్కారాలు చూపేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి కార్యాచరణ చేపడుతున్నామని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాల అమలుకు ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని ప్రతి కుటుంబం ఆర్థికంగా బలోపేతం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తహసిల్దార్ జి.సుభద్రమ్మ, ఎంపీడీవో ఎన్.చంద్రశేఖర్, డిప్యూటీ ఎంపీడీవో తిరుపాలు, ఈవోఆర్డి సులోచన, ఏపీవో బి.జయంతి, అగ్రికల్చర్ ఏవో ఎం.వెంకట మహేశ్వర్ రెడ్డి, పాములపాడు పంచాయతీ కార్యదర్శి క్రాంతి కుమార్, ఈసీ గౌస్, టిఏ లు ఎన్.స్వాములు, ఫయాజ్, ఫీల్డ్ అసిస్టెంట్ లింగస్వామి, స్వామిదాసు, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, మెట్లు, ఉపాధి హామీ శ్రామికులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :