Tuesday, 28 July 2026 07:46:49 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

మాదకద్రవ్యాలతో భవిష్యత్‌ నాశనం చేసుకోవద్దు

ఎమ్మెల్యే గిత్త.జయసూర్య

Date : 23 December 2025 09:09 PM Views : 191

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : నందికొట్కూరు పరిధిలోని పోలీస్ సిబ్బంది ఆత్మకూరు డి.ఎస్.పి-ఆర్.రామాంజి నాయక్, అర్బన్ సీఐ ప్రవీణ్ రెడ్డి, రూరల్ సీఐ-సుబ్రహ్మణ్యం, ఎక్స్చేంజ్ సిఐ-రామాంజు నాయక్ ల ఆధ్వర్యంలో నిర్వహించిన, మాదకద్రవ్యాల అలవాటుతో భవిష్యత్‌ నాశనమవుతుందని, మాదకద్రవ్యాల నివారణకు సమష్టిగా కృషి చేయాలని గవర్నమెంట్ కాలేజ్ నుంచి పటేల్ సెంటర్ వరకు విభాగం విద్యార్థులతో కలసి డ్రగ్స్‌, ఉమెన్‌ ట్రాఫికింగ్‌ పై నిర్వహించిన అవగాహన ర్యాలీ లో నాయకులతో, అధికారులతో కలిసి నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త.జయసూర్య పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా పటేల్ సెంటర్లో ఎమ్మెల్యే గిత్త.జయసూర్య మాట్లాడుతూ, డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనే కూటమి ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా డ్రగ్స్‌ రహిత సమాజానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. నందికొట్కూరు నియోజకవర్గంలో మానవ హారంగా ఏర్పడి డ్రగ్స్‌కు వ్యతిరేకంగా విద్యార్థులు ప్రతిజ్ఞ నినాదాలు చేశారు. మాదకద్రవ్యాల నిరోధానికి ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం లీగల్ డ్రగ్స్కు టీమ్ ను ఏర్పాటు చేసి డ్రక్షకు సంబంధించిన సమాచారం లేదా ఫిర్యాదులు ఉన్నట్లయితే వెంటనే ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972 కి తెలియజేయాలని ఎమ్మెల్యే గిత్త జయసూర్య కోరారు. డ్రగ్స్ నిర్మూలనకు ఏపీ ప్రభుత్వం యుద్ధభేరి మోగించిందని, ఈ పోరాటంలో ప్రభుత్వం–ప్రజలు కలిసికట్టుగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా తెలియజేశారు. మాదక ద్రవ్యాల రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే గిత్త.జయసూర్య హెచ్చరించారు. మాదక ద్రవ్యాల వినియోగం యావజ్జీవ కారాగార శిక్ష విధించదగిన నేరం అని అంటారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ లా ఆఫ్ 1977, ఎస్.10 (డి), ఎస్.30 కింద కేసులు నమోదు అవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ & మండల కన్వీనర్ మాండ్ర.సురేంద్రనాథ్ రెడ్డి, జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు, కూటమి నాయకులు మీనాక్షి దేవి, మాండ్ర.శివానందరెడ్డి పిఏ- మద్దిలేటి, ఎమ్మెల్యే గవర్నమెంట్ పిఏ-రవీంద్ర, తదితర టిడిపి నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ అధికారులు, అన్ని మండలాల ఎస్సైలు, స్కూలు టీచర్లు విద్యార్థులు, మీడియా మిత్రులు, పోలీస్ సిబ్బంది, జనసేన నాయకులు పాల్గొనడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :