ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : నందికొట్కూరు పరిధిలోని పోలీస్ సిబ్బంది ఆత్మకూరు డి.ఎస్.పి-ఆర్.రామాంజి నాయక్, అర్బన్ సీఐ ప్రవీణ్ రెడ్డి, రూరల్ సీఐ-సుబ్రహ్మణ్యం, ఎక్స్చేంజ్ సిఐ-రామాంజు నాయక్ ల ఆధ్వర్యంలో నిర్వహించిన, మాదకద్రవ్యాల అలవాటుతో భవిష్యత్ నాశనమవుతుందని, మాదకద్రవ్యాల నివారణకు సమష్టిగా కృషి చేయాలని గవర్నమెంట్ కాలేజ్ నుంచి పటేల్ సెంటర్ వరకు విభాగం విద్యార్థులతో కలసి డ్రగ్స్, ఉమెన్ ట్రాఫికింగ్ పై నిర్వహించిన అవగాహన ర్యాలీ లో నాయకులతో, అధికారులతో కలిసి నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త.జయసూర్య పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా పటేల్ సెంటర్లో ఎమ్మెల్యే గిత్త.జయసూర్య మాట్లాడుతూ, డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనే కూటమి ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా డ్రగ్స్ రహిత సమాజానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. నందికొట్కూరు నియోజకవర్గంలో మానవ హారంగా ఏర్పడి డ్రగ్స్కు వ్యతిరేకంగా విద్యార్థులు ప్రతిజ్ఞ నినాదాలు చేశారు. మాదకద్రవ్యాల నిరోధానికి ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం లీగల్ డ్రగ్స్కు టీమ్ ను ఏర్పాటు చేసి డ్రక్షకు సంబంధించిన సమాచారం లేదా ఫిర్యాదులు ఉన్నట్లయితే వెంటనే ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972 కి తెలియజేయాలని ఎమ్మెల్యే గిత్త జయసూర్య కోరారు. డ్రగ్స్ నిర్మూలనకు ఏపీ ప్రభుత్వం యుద్ధభేరి మోగించిందని, ఈ పోరాటంలో ప్రభుత్వం–ప్రజలు కలిసికట్టుగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా తెలియజేశారు. మాదక ద్రవ్యాల రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే గిత్త.జయసూర్య హెచ్చరించారు. మాదక ద్రవ్యాల వినియోగం యావజ్జీవ కారాగార శిక్ష విధించదగిన నేరం అని అంటారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ లా ఆఫ్ 1977, ఎస్.10 (డి), ఎస్.30 కింద కేసులు నమోదు అవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ & మండల కన్వీనర్ మాండ్ర.సురేంద్రనాథ్ రెడ్డి, జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు, కూటమి నాయకులు మీనాక్షి దేవి, మాండ్ర.శివానందరెడ్డి పిఏ- మద్దిలేటి, ఎమ్మెల్యే గవర్నమెంట్ పిఏ-రవీంద్ర, తదితర టిడిపి నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ అధికారులు, అన్ని మండలాల ఎస్సైలు, స్కూలు టీచర్లు విద్యార్థులు, మీడియా మిత్రులు, పోలీస్ సిబ్బంది, జనసేన నాయకులు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News