ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : కర్నూలు పట్టణంలో తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలిగా ఎంపికైన గౌరు.చరితారెడ్డి కి ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్-జి.నాగముని శాలువా కప్పి, పుష్పగుచ్చం చేతికి అందించి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఏపీఈడబ్ల్యుఐడీసీ రాష్ట్ర డైరెక్టర్- జి.నాగముని నాయకులతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అనంతరం పాణ్యం నియోజవర్గం ఎమ్మెల్యే గౌరు.చరితారెడ్డి నిర్వహించిన గ్రీవెన్స్ లో జిల్లాలోని ప్రజల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర డైరెక్టర్- జి.నాగముని వినతిపత్రం సమర్పించడం జరిగింది. పాణ్యం నియోజవర్గంలోని, బాధితులకు ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి తో కలిసి, ఏపీఈడబ్ల్యుఐడిసి రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బ్రాహ్మణపల్లి నాగిరెడ్డి, ప్రభాకర్ యాదవ్, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News