ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : 2026 -27 సంవత్సరానికి సంబంధించి పాములపాడు మండలానికి 220 జీవాలకు భీమా లక్ష్యం నిర్దేశించడమైనదని పశువైద్యాధికారి డాక్టర్ పి.భాస్కర్ మీడియా సమావేశంలో తెలిపారు. పాములపాడు మండలంలోని, గొర్రెల, మేకల పెంపకం దారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పశువైద్యాధికారి డాక్టర్ పి.భాస్కర్ కోరారు. ఈ సందర్భంగా పశువైద్యాధికారి డాక్టర్ పి.భాస్కర్ మాట్లాడుతూ వివరాలకు సమీపంలోని, రైతు సేవా కేంద్రంలోని అనీమల్ హస్బెం డ్రి అసిస్టెంట్ , స్థానిక పశువైద్యాధికారిని సమర్పించాలన్నారు. పెంపకం దారులు 6 నెలలు దాటిన గొర్రెలకు, మేకలకు భీమా చేయించాలన్నారు. 1 సంవత్సరము రూ"లు 6,000/- భీమా వర్తించుట కొరకు చెల్లించవలసిన ప్రీమియం 180 రూపాయలు కాగా, ప్రభుత్వ సబ్సిడీ రూ 153 పోను లబ్దిదారుడు కేవలం 27 రూపాయలు చెల్లిస్తే సరిపోతుందనీ అన్నారు. ప్రతి గొర్రె, మేక కి తప్పని సరిగా చెవి పోగు / ట్యాగ్ వేయించాలన్నారు. ఎప్పుడైనా చెవి పోగు / ట్యాగ్ పడిపోతే వెంటనే పశువైద్య సిబ్బంది చేత కొత్త ట్యాగ్ వేయించాలనీ అన్నారు. ట్యాగ్ లేనిచో భీమా వర్తించదనీ అన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది తిరుమలేష్, కవిత, పాల్గొన్నారు.
Admin
E Nivas News