ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు పట్టణంలోని, ఎల్ఐసీ ఆఫ్ ఇండియా శాఖలో నిర్వహించిన 70వ వార్షికోత్సవ బీమా వారోత్సవాలు ఘనంగా ముగిశాయి. ముఖ్య అతిథి డా. డి.నాగన్న మందులు మరియు యాంటీబయాటిక్స్ను బాధ్యతగా ఉపయోగించడంపై విలువైన సూచనలు అందించారు. దేశ నిర్మాణంలో ఎల్ఐసీ పోషిస్తున్న ముఖ్యమైన పాత్రను, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడంలో బీమా ప్రాముఖ్యతను వివరించారు. శాఖ మేనేజర్ జయసింహ జెరపు శాఖ పనితీరు మరియు విజయాలను వివరించారు. ఈ సందర్భంగా శాఖలోని సీనియర్ మోస్ట్ ఏజెంట్లను డా. డి.నాగన్న ఘనంగా సత్కరించారు. వారోత్సవాల్లో ఏజెంట్లు, ఉద్యోగులు మరియు పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు డా. డి.నాగన్న మరియు శాఖ మేనేజర్ జయసింహ జెరపు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏజెంట్స్ యూనియన్ నాయకులు సాయి బాబు, రాంబాబు, ఐసిఈయు నాయకులు విజయ్ కుమార్, రవి కుమార్, జి.నాగన్న, ఫెడరేషన్ నాయకులు రాజు, ఏవో రాజశేఖర్ నాయక్, స్టాఫ్ మిత్రులు పాల్గొన్నారు. వారోత్సవాలను విజయవంతం చేసిన అందరూ ఏజెంట్లు, ఉద్యోగులు, కస్టమర్లు మరియు పాల్గొన్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
Admin
E Nivas News