ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు ని అవమాన పరుస్తూ సోషల్ మీడియా వేదికలలో అనుచిత వ్యాఖ్యలు (X వేదికలో "కల్యాణ్ బాబు ఫాన్" అకౌంట్ లో పోస్ట్ చేసిన వ్యక్తిపై)చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నందికొట్కూరు మండలంలోని, బ్రాహ్మణకొట్కూరు పోలీస్ స్టేషన్ నందు ఏఎస్ఐ కి నందికొట్కూరు మండల కన్వీనర్ & మార్కెట్ యార్డ్ డైరెక్టర్- మాండ్ర.సురేంద్రనాథ్ రెడ్డి కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణకొట్కూరు సొసైటీ చైర్మన్ మద్దూరు సర్వోత్తమరెడ్డి, మాజీ సర్పంచ్ ఖాళీలు బేగ్, నాయకులు లక్ష్మీనారాయణ, ఖాజా మోహిద్దీన్, లాడెన్, మద్దిలేటి మరియు ఇతర టిడిపి నాయకులు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News