Wednesday, 29 July 2026 07:25:12 PM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

సీనియర్ ఖోఖో ఆటలో జాతీయ స్థాయిలో సత్తా చాటిన క్రీడా ఆణిముత్యం మండ్ల ప్రసాద్

మాండ్ల ప్రసాద్ కు అభినందనలు తెలియజేసిన డీఎస్పీ- ఆర్.రామాంజి నాయక్, సి.ఐ- మహేశ్వర్ రెడ్డి, ఎస్సై-నారాయణరెడ్డి

Date : 19 January 2026 07:56 PM Views : 304

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు మండలంలోని, కొట్టాలచెరువు గ్రామానికి చెందిన మండ్ల రాఘవేంద్ర, మండ్ల నాగమణి దంపతుల కుమారుడు మండ్ల ప్రసాద్ జాతీయ స్థాయిలో జరిగిన సీనియర్ ఖోఖో ఆటలో పాల్గొనడం జరిగింది. మండ్ల ప్రసాద్ కు తల్లిదండ్రులతోపాటు బంధువులు, గ్రామస్తులు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ కుమారుడు చదువుతోపాటు చక్కని క్రమశిక్షణతో ఆటలలో రాణిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. ఈ నెల 11 నుండి 15 వరకు తెలంగాణ రాష్ట్రంలోని, ఖాజీపేటలో జాతీయ స్థాయి ఖోఖో ఆటలో పాల్గొన్న క్రీడాకారుడికి ఆత్మకూరు డిఎస్పి- ఆర్.రామాంజి నాయక్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డీఎస్పీ- ఆర్.రామాంజీ నాయక్ మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారులకు జాతీయ స్థాయిలో రాణించిన వాళ్లకు అన్ని రకాల సహాయ, సహకారాలు అందిస్తామని తెలియజేశారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు జాతీయ స్థాయి ఆటల పోటీల్లో పాల్గొని, రాణించడం హర్షించదగ్గ విషయం అని అన్నారు. క్రీడాకారుడు మాండ్ల.ప్రసాద్ కు ఆత్మకూరు అర్బన్ సీఐ- మహేశ్వర్ రెడ్డి, ఎస్సై- నారాయణరెడ్డి, గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు జవహార్ నాయక్, టీడీపి నాయకులు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు టిడిపి నాయకులు, కొట్టాలచెరువు గ్రామ సర్పంచ్ నాగలక్ష్మి, గ్రామస్తులు, గిరిజన సంఘ నాయకులు పాల్గొనడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :