Tuesday, 28 July 2026 06:59:02 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

మాల మహానాడు బండిఆత్మకూరు మండల నూతన కమిటీ ఎంపిక :- మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు బండి.దేవాంతకుడు

Date : 16 November 2025 08:50 AM Views : 257

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / బండి ఆత్మకూరు : శనివారం బండి ఆత్మకూరు పట్టణంలో, మాల మహానాడు నూతన కమిటీనీ మాల మహానాడు మాల సంఘాల జేఏసీ రాష్ట్ర కార్యదర్శి దస్తగిరి అధ్యక్షతన ఎన్నుకోవడం జరిగింది. మండల ప్రెసిడెంట్ గా దర్గా.చిన్న చెన్నయ్య, మండల ఉపాధ్యక్షుడుగా దాసి.బాలరాజు, మండల సెక్రెటరీగా కొర్రపోలు సుధాకర్, మండల ఉపాధ్యక్షుడిగా బరిగేల.కిట్టు, కోశాధికారిగా పరదేశి. సాగర్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు బండి. దేవాంతకుడు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాల సంఘాల జేఏసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు చెరుకూరి.అశోక్ రత్నం, మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు కలబండి. అంకన్న లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు చెరుకూరి.అశోక్ రత్నం, మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు కలబండి. అంకన్న లు మాట్లాడుతూ రాష్ట్రంలో క్రిమిలేరి విధానం వలన మాలులకు తీవ్ర అన్యాయం జరిగిందని క్రిమిలైజేషన్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని కోరారు. గత ప్రభుత్వం రద్దు చేసిన 26 పథకాలను తిరిగి పునరుద్దించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చి ఒకటిన్నర సంవత్సరం అవుతున్న ఒక అంబేద్కర్ యువజన విధానం పథకం తప్ప ఏ ఒక్కటి అమలు చేయలేదని స్థాయిలో ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు దర్గా. నరసింహుడు, మాజీ సర్పంచ్ వేదనాయకం మాజీ ఎంపీటీసీ భాస్కర్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు సుధాకర్, మాల మహానాడు మహిళా రాష్ట్ర అధ్యక్షులు రోజక్క, మాల మహానాడు జేఏసీ రాష్ట్ర రాయలసీమ అధ్యక్షులు బి.మద్దిలేటి, మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి మారం.నాగరాజు, మాల మహానాడు నంద్యాల జిల్లా కార్యదర్శి కే.శివుడు, మద్దూరు మాజీ సర్పంచ్ మద్దిలేటి, వెలుగోడు మాల మహానాడు మండల అధ్యక్షుడు చెన్నయ్య, కడప అంబేద్కర్ శివాజీ, బాలరాజు, తదితర మాల మహానాడు కార్యకర్తలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :