ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / బండి ఆత్మకూరు : శనివారం బండి ఆత్మకూరు పట్టణంలో, మాల మహానాడు నూతన కమిటీనీ మాల మహానాడు మాల సంఘాల జేఏసీ రాష్ట్ర కార్యదర్శి దస్తగిరి అధ్యక్షతన ఎన్నుకోవడం జరిగింది. మండల ప్రెసిడెంట్ గా దర్గా.చిన్న చెన్నయ్య, మండల ఉపాధ్యక్షుడుగా దాసి.బాలరాజు, మండల సెక్రెటరీగా కొర్రపోలు సుధాకర్, మండల ఉపాధ్యక్షుడిగా బరిగేల.కిట్టు, కోశాధికారిగా పరదేశి. సాగర్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు బండి. దేవాంతకుడు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాల సంఘాల జేఏసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు చెరుకూరి.అశోక్ రత్నం, మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు కలబండి. అంకన్న లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు చెరుకూరి.అశోక్ రత్నం, మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు కలబండి. అంకన్న లు మాట్లాడుతూ రాష్ట్రంలో క్రిమిలేరి విధానం వలన మాలులకు తీవ్ర అన్యాయం జరిగిందని క్రిమిలైజేషన్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని కోరారు. గత ప్రభుత్వం రద్దు చేసిన 26 పథకాలను తిరిగి పునరుద్దించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చి ఒకటిన్నర సంవత్సరం అవుతున్న ఒక అంబేద్కర్ యువజన విధానం పథకం తప్ప ఏ ఒక్కటి అమలు చేయలేదని స్థాయిలో ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు దర్గా. నరసింహుడు, మాజీ సర్పంచ్ వేదనాయకం మాజీ ఎంపీటీసీ భాస్కర్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు సుధాకర్, మాల మహానాడు మహిళా రాష్ట్ర అధ్యక్షులు రోజక్క, మాల మహానాడు జేఏసీ రాష్ట్ర రాయలసీమ అధ్యక్షులు బి.మద్దిలేటి, మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి మారం.నాగరాజు, మాల మహానాడు నంద్యాల జిల్లా కార్యదర్శి కే.శివుడు, మద్దూరు మాజీ సర్పంచ్ మద్దిలేటి, వెలుగోడు మాల మహానాడు మండల అధ్యక్షుడు చెన్నయ్య, కడప అంబేద్కర్ శివాజీ, బాలరాజు, తదితర మాల మహానాడు కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
E Nivas News