Thursday, 30 July 2026 12:38:17 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

ఆత్మకూరులోని సమీకృత బాలుర వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన డివిఎంసి మెంబర్ లింగాల నాగరాజు

ఇంటిగ్రేటెడ్ హాస్టల్ వార్డెన్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం 12-30 పెట్టవలసి ఉండగా 2 గంటలకు పెట్టడం ఎంత నిర్లక్ష్యం

Date : 17 November 2025 10:11 AM Views : 228

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : సమీకృత ఇంటిగ్రేటెడ్ బాలుర వసతి గృహంలో పనిచేసే వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల.నాగరాజు అధికారులను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆత్మకూరు పట్టణంలోనీ, దుద్యాల రోడ్డులో ఉన్న సమీకృత ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ను నంద్యాల జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల.నాగరాజు ఈ హాస్టల్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాస్టల్లో సరైన సమయానికి పిల్లలకు భోజనం పెట్టకుండా 12:30 కు పెట్టాల్సిన మధ్యాహ్నం భోజనం దాదాపు రెండు గంటల ప్రాంతంలో భోజనాలు పెట్టడం దారుణం అన్నారు. 50 మంది విద్యార్థులకు మూడున్నరకిలోల చికెన్ పెట్టడం ఎంతవరకు సమంజసమని ఎద్దేవా చేశారు. బాత్రూములకు డోర్లు లేక పిల్లలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యం చాలా ఉందని కనీసం ఉదయం టిఫిన్ చేసిన టైం నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు త్రాగునీరు లేక పిల్లలు ఇబ్బందులకు గురవుతున్న పట్టించుకునే నాధుడే ఇక్కడ లేడని ఆయన అన్నారు. పుచ్చిపోయిన కూరగాయలు వండి విద్యార్థులకు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత మూడు నెలల నుండి హాస్టల్ మరమ్మతులు చేస్తున్న వేస్టు బండలు, సిమెంట్, ఇసుక హాస్టల్ గదులు ముందే ఉందని ఆ బండలు ఆ మెటీరియల్ పిల్లలకు తట్టుకొని క్రిందపడే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. విద్యార్థులు ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు, కర్నూలు వివిధ ప్రాంతాల నుంచి వస్తే బాగా చూసుకోవాల్సిన వార్డెన్ నిర్లక్ష్యం వహిస్తే, పిల్లలు ఎవరికి చెప్పుకోవాలని ఆయన అన్నారు. తనిఖీ చేసే సమయంలో హాస్టల్ వార్డెన్ అందుబాటులో లేడని ఆయన అన్నారు. రూములకు బండ పరుపు కోసం సుమారు 6,90,000/- రూపాయలు ప్రభుత్వం కేటాయిస్తే నాసిరకం బండలు, నాసిరకం సిమెంటు వేసి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మరియు హాస్టల్లో సరిగ్గా సమయానికి భోజనం పెట్టకుండా, వార్డెన్ లేకపోయినా ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదొ సమాధానం చెప్పాలని, కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ పై, హాస్టల్ వార్డెన్ పై, కాంట్రాక్టర్ పై నంద్యాలలో రేపు జరిగే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(గ్రీవెన్స్)లో కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తానని ఆయన హెచ్చరించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :