ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : సమీకృత ఇంటిగ్రేటెడ్ బాలుర వసతి గృహంలో పనిచేసే వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల.నాగరాజు అధికారులను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆత్మకూరు పట్టణంలోనీ, దుద్యాల రోడ్డులో ఉన్న సమీకృత ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ను నంద్యాల జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల.నాగరాజు ఈ హాస్టల్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాస్టల్లో సరైన సమయానికి పిల్లలకు భోజనం పెట్టకుండా 12:30 కు పెట్టాల్సిన మధ్యాహ్నం భోజనం దాదాపు రెండు గంటల ప్రాంతంలో భోజనాలు పెట్టడం దారుణం అన్నారు. 50 మంది విద్యార్థులకు మూడున్నరకిలోల చికెన్ పెట్టడం ఎంతవరకు సమంజసమని ఎద్దేవా చేశారు. బాత్రూములకు డోర్లు లేక పిల్లలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యం చాలా ఉందని కనీసం ఉదయం టిఫిన్ చేసిన టైం నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు త్రాగునీరు లేక పిల్లలు ఇబ్బందులకు గురవుతున్న పట్టించుకునే నాధుడే ఇక్కడ లేడని ఆయన అన్నారు. పుచ్చిపోయిన కూరగాయలు వండి విద్యార్థులకు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత మూడు నెలల నుండి హాస్టల్ మరమ్మతులు చేస్తున్న వేస్టు బండలు, సిమెంట్, ఇసుక హాస్టల్ గదులు ముందే ఉందని ఆ బండలు ఆ మెటీరియల్ పిల్లలకు తట్టుకొని క్రిందపడే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. విద్యార్థులు ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు, కర్నూలు వివిధ ప్రాంతాల నుంచి వస్తే బాగా చూసుకోవాల్సిన వార్డెన్ నిర్లక్ష్యం వహిస్తే, పిల్లలు ఎవరికి చెప్పుకోవాలని ఆయన అన్నారు. తనిఖీ చేసే సమయంలో హాస్టల్ వార్డెన్ అందుబాటులో లేడని ఆయన అన్నారు. రూములకు బండ పరుపు కోసం సుమారు 6,90,000/- రూపాయలు ప్రభుత్వం కేటాయిస్తే నాసిరకం బండలు, నాసిరకం సిమెంటు వేసి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మరియు హాస్టల్లో సరిగ్గా సమయానికి భోజనం పెట్టకుండా, వార్డెన్ లేకపోయినా ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదొ సమాధానం చెప్పాలని, కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ పై, హాస్టల్ వార్డెన్ పై, కాంట్రాక్టర్ పై నంద్యాలలో రేపు జరిగే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(గ్రీవెన్స్)లో కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తానని ఆయన హెచ్చరించారు.
Admin
E Nivas News