Sunday, 13 September 2026 11:58:29 PM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

కర్నూలులో చిరుధాన్యాల ఆవశ్యకతపై అవగాహన సదస్సు

Date : 24 November 2025 09:34 PM Views : 283

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : అదితి చిరుధాన్యాల ఆధ్వర్యంలో కర్నూలు పట్టణంలోని, టీ.జీ.వి. కళాక్షేత్రం లో ఈ రోజు నిర్వహించిన చిరుధాన్యాలపై అవగాహన సదస్సులో పద్మశ్రీ డాక్టర్ ఖాదర్ వలి ప్రధాన అతిథిగా పాల్గొన్నారు. 1000 మందికి పైగా రైతులు మిల్లెట్ వినియోగదారులు పాల్గొన్నారు. సభలో మాట్లాడిన డాక్టర్ ఖాదర్ వలి చిరుధాన్యాల్లో గట్ మైక్రోబ్స్‌ను పెంచే సహజ గుణాలు, అధిక ఫైబర్, అలాగే రక్తంలో ఏర్పడే థిక్కెనింగ్ (రక్తం గడ్డ కావడం)ను తగ్గించే లక్షణాలను వివరించారు. చిరుధాన్యాలు రోజువారీ ఆహారంలో భాగం అయితే జీవనశైలిలో గణనీయమైన మార్పు వస్తుందని సూచించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాణ్యం ఎమ్మెల్యే గౌరు.చరిత రెడ్డి హాజరై, ఆరోగ్యం కోసం చిరుధాన్యాల వినియోగం పెరగాల్సిన అవసరాన్ని చెప్పారు. చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి, టి.జి. జగదీష్, మరియు అదితి మిల్లెట్స్ వ్యవస్థాపకులు సిఎ- కడింపల్లి.మోహన్, పోతుల.శేఖర్ పాల్గొన్నారు. అదితి మిల్లెట్స్ ప్రతినిధులు మాట్లాడుతూ సంస్థకు కర్నూలులోనే స్వంతంగా మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ ఉండి, 200 మంది రైతులతో పని చేస్తూ, ప్రాసెస్ చేసి చిరుధాన్యాలను దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. ప్రజల్లో ఆరోగ్య అవగాహన పెంచేందుకు ఇటువంటి కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తామని అన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :