Wednesday, 29 July 2026 08:15:10 PM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

పెంచిన డీజిల్, పెట్రోల్, ఎరువుల ధరలను తక్షణమే తగ్గించాలి

సిపిఎం, కాంగ్రెస్, ప్రజాసంఘాల నాయకులు

Date : 18 May 2026 09:04 PM Views : 102

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పెంచిన పెట్రోల్, డీజిల్, రైతుల ఎరువుల ధరలు వెంటనే తగ్గించాలని, ఖరీఫ్ సీజన్‌లో వ్యవసాయానికి అవసరమైన డి ఏపి యూరియా కాంప్లెక్స్ రకాల ఎరువులను కొరత లేకుండా సరఫరా చేయాలని, ఎరువుల బ్లాక్ మార్కెట్‌ను అరికట్టాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి డి.స్వామన్న, రైతు సంఘం జిల్లా నాయకులు కోట్ల నాగేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎస్.షేక్షాఅలీ, సిఐటియు మండల కార్యదర్శి మేకల రాజు, సోషల్ వర్కర్ కలబండి.నాగరాజు, తదితర ప్రజాసంఘాల నాయకులు బస్టాండ్ లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలిపి, డిమాండ్ చేశారు. ఈ సందర్భముగా వారు మాట్లాడుతూ యుద్దం సాకు చూపి ఎరువుల కంపెనీలు ఎరువుల ధరలు పెంచి అన్నదాతల నడ్డి విరుస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇరాన్- అమెరికా ఇజ్రాయిల్ ల యుద్దం ప్రభావంతో ఉత్పత్తి ఖర్చులు పెరిగితే కేంద్ర ప్రభుత్వం ఎరువులపై సబ్సిడీ ఇవ్వాలి తప్ప ధరలు పెంచడానికి అనుమతినివ్వడం రైతులను నిలువునా ముంచడమే తప్ప ఇంకొకటి కాదన్నారు. ఇప్పటికే పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడి పెట్టలేక అప్పులపాలవుతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చీమకుట్టినైన స్పర్శ లేదని విమర్శించారు ప్రభుత్వ సహకార ప్రవేట్ రంగాలలోని కంపెనీలు ఎరువుల ధరలు పెంచకుండా కేంద్రం చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు మూడు రూపాయలపైన పెంచాయని, మరోసారి దశల వారి పది రూపాయల వరకు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతున్న ఈ సీజన్లో ఇప్పుడు ఎరువుల ధరలు పెరగడం వల్ల రైతును వ్యవసాయం నుండి బేధఖల్ చేయడమే అని అన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతుండగానే ఎరువుల ధరలు పెంచడం రైతాంగానికి మోయలేని భారమవుతుందన్నారు. ఒక్కో బస్తాకు రూ.125 నుండి 300లు పెంపుదల వలన రాష్ట్ర రైతాంగంపై రూ.800 కోట్ల భారం పడనున్నదని విచారం వ్యక్తం చేశారు. ఎరువుల దుకాణాల వ్యాపారులు ఇష్టారాజ్యంగా ఎరువుల ధరలు పెంచకుండా, బ్లాక్ మార్కెట్‌కు తరలించకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అవసరమైతే ఎరువుల సబ్సిడీని పెంచి, ఎరువుల ధరలు పెరగకుండా చూడాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో షేక్షావలి, మేకల రాజు, బాల యేసు చెన్నయ్య, సోషల్ వర్కర్ నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: