Tuesday, 28 July 2026 06:02:28 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

నిరుపేద కుటుంబానికి అండగా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి- నవజాత శిశువు చికిత్సకు ఎల్ ఓ సి ద్వారా రూ. 3,01,192/- లు మంజూరు

ఆపత్కాలంలో అండగా నిలిచిన ఎమ్మెల్యే బుడ్డా రాజన్న

Date : 01 July 2026 10:39 PM Views : 55

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు మండలంలోని, నల్లకాలువ గ్రామంలో కళ్లు కూడా తెరవని ఆ పసికందుకి లోకమేంటో తెలియదు. అమ్మ ఒడిలోని వెచ్చదనాన్ని పూర్తిగా ఆస్వాదించక ముందే, ఆ చిన్నారి ప్రాణం ఊపిరి కోసం కొట్టుమిట్టాడింది. ఆత్మకూరు మండలంలోని, నల్లకాలువ గ్రామానికి చెందిన అమరం మనీషా అనే నిరుపేద మహిళకు పుట్టిన నవజాత శిశువు, తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో ఈ లోకంలోకి అడుగుపెట్టింది. పుట్టుకతోనే తక్కువ బరువు దానికి తోడు గుండె, ఊపిరితిత్తులు పూర్తిగా అభివృద్ధి చెందకపోవడంతో ఆ పసిగుడ్డు శ్వాస తీసుకోవడానికే నరకయాతన అనుభవించింది. నరసరావుపేటలోని, లైఫ్ లైన్ హాస్పిటల్ లో కన్నబిడ్డ ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంది, మెరుగైన చికిత్స కోసం రెక్కాడితే గానీ డొక్కాడని ఆ పేద కుటుంబానికి ఏం చేయాలో పాలుపోలేదు. రూపాయి కూడబెట్టే స్తోమత లేక, కళ్లముందే బిడ్డ ప్రాణం విలవిలలాడుతుంటే ఆ తల్లి గుండె పగిలిపోయింది. ఆపద్బాంధవుడిగా నిలిచిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి:- ఆ కటిక చీకట్లో వారికి ఆశాకిరణంలా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అండగా నిలిచారు. తమ బిడ్డను బతికించాలంటూ ఆ కుటుంబం తల్లడిల్లుతూ ఆయన్ను ఆశ్రయించగా ఆ తల్లి కడుపు కోతను, పసికందు పరిస్థితిని చూసి చలించిపోయిన ఎమ్మెల్యే క్షణం కూడా ఆలస్యం చేయకుండా తక్షణమే ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా అత్యవసరంగా వైద్య సహాయం అందేలా చొరవ తీసుకున్నారు. అధికారులతో మాట్లాడి, యుద్ధప్రాతిపదికన ప్రక్రియను పూర్తి చేయించి, శిశువు వైద్య చికిత్స నిమిత్తం ఏకంగా రూ. 3,01,192/-ల ఆర్థిక సహాయాన్ని ఎల్ఓసి ద్వారా మంజూరు చేయించారు. *కృతజ్ఞతా భావంతో కన్నీటి పర్యంతమైన కుటుంబం ఈ ఆర్థిక సాయం అందడంతో ఆ పసికందుకు మెరుగైన వైద్యం అందుతోంది. డబ్బు లేక వైద్యం ఆగిపోతుందనే భయం నుండి ఆ తల్లిదండ్రులు బయటపడ్డారు. తమ బిడ్డకు పునర్జన్మ ప్రసాదించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, దేవుడిలా వచ్చి ఆదుకున్న ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి కి ఆ కుటుంబ సభ్యులు చేతులు జోడించి, కన్నీటితో కృతజ్ఞతలు తెలుపుకున్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :