Tuesday, 28 July 2026 04:37:51 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

పాములపాడు మండలంలో ఘనంగా మెగా (పిటిఎం-4.0) పేరెంట్స్ -టీచర్స్ సమ్మేళనం

Date : 24 July 2026 10:45 PM Views : 44

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : మండల కేంద్రమైన పాములపాడులోని, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో ప్రిన్సిపాల్ ఎం.రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా (పిటియం-4.0) పేరెంట్స్ -టీచర్స్ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా తహసిల్దార్ జి.సుభద్రమ్మ పాల్గొనగా, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వి.ఎం.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ పాల్గొనడం జరిగింది. స్కూల్ పేరెంట్స్ డే సందర్భంగా తహాసిల్దార్ జి.సుభద్రమ్మ, కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం ప్రిన్సిపాల్ ఎం.రాజ్యలక్ష్మి, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వి.ఎం. వెంకటేశ్వర్లు, హెల్త్ ఎడ్యుకేటర్ జి.మల్లికార్జున, తదితర వక్తలు మాట్లాడుతూ ముఖ్యంగా తల్లికి వందనం ప్రతి కుటుంబంలో ఎంత మంది ఉంటే అంత మందికి పిల్లలకి డబ్బులు అకౌంట్లో వేసి చరిత్ర సృష్టించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కి, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబుకు ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేశారు. తల్లికి వందనం డబ్బులు తల్లుల అకౌంట్లో పడుతున్నాయని తెలిసి ప్రతి కుటుంబంలో మరియు పిల్లలు ఆనందం వ్యక్తం చేస్తూ ప్రతి స్కూలులో పండుగ వాతావరణం కనిపించిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం ద్వారా 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న అర్హులైన ప్రతి విద్యార్థికి రూ. 15,000 కేటాయించగా, అందులో రూ.2,000 పాఠశాలల అభివృద్ధికి మినహాయించి నేరుగా రూ. 13,000 తల్లుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా నాణ్యమైన విద్య అందించే విధంగా పిల్లలు ఆయురారోగ్యాలతో ఉండాలని కార్పొరేట్ ప్రవేట్ స్కూళ్ల కంటే దీటుగా ప్రభుత్వ స్కూలు ఏర్పాటు అయ్యాయని ప్రతి ఒక్క తల్లితండ్రులు ఆలోచించి ప్రభుత్వ బడుల్లో పిల్లలకు చేర్పించండి అని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథముగా నంబర్ వన్ గా తీర్చిదిద్దాలని ఆలోచనతో ముందుకు వెళ్తున్నారన్నారు. విద్యార్థుల చదువు నిరంతరం అభివృద్ధి చేసే విధంగా కొనసాగాలని కోరుకుంటున్నాము తల్లితండ్రులు పిల్లలకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమము ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో, చాలా సంతోషంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల సిబ్బంది అయినటువంటి డీకే.ఈశ్వర్ (ఫిజిక్స్), ఏ.హేమలత (తెలుగు), కే.రాజు (కెమిస్ట్రీ), కే.భాగ్యమ్మ (జువాలజీ), ఇ.రవీంద్ర (బాటని ), సి.భాగ్యలక్ష్మి (మాథ్స్), వి.అశోక్ రత్నం (హిస్టరీ), ఆర్.రత్న ప్రభ (ఇంగ్లీష్), కె.విజయభాస్కర్ (ఎకనామిక్స్), ఎన్.లక్ష్మణస్వామి (కామర్స్), నాటి చింగ్ స్టాఫ్ అయినటువంటి రామ తులసి, సచివాలయం బి.మాధవి, కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం అధ్యాపకులు, ఉపాధ్యాయులు కే.శైలజ, కళ్యాణి, ఆయా పాఠశాలల, కాలేజీలల విద్యా కమిటీ చైర్మన్లు, సభ్యులు తదితరులు విద్యార్థిని, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :