ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / వెలుగోడు : వెలుగోడు మండల కేంద్రంలోని, గుంతకందాల గ్రామంలో శనివారం రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో కృష్ణ స్వామి ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రం ను గ్రామ రైతులు, రైతు సాధికార సిబ్బంది, నాయకుల ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతు సాధికార సంస్థ ఎస్ ఆర్ పి నరేంద్ర గౌడ్ మాట్లాడుతూ రైతులు అధిక మోతాదులో రసాయన పురుగు మందులు వాడటం వల్ల నేల, ఆహారం, గాలి కాలుష్యంతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతున్నాయని అలాగే పంటలకు అయ్యే పెట్టుబడులు పెరిగి దిగుబడులు తగ్గి భూమిలో పోషకాలు తగ్గిపోతున్నాయన్నారు. నేల ఒక జీవచ్ఛవంలా ఐపోయిందని అందుకోసం ప్రతి ఒక్కరు కచ్చితంగా ప్రకృతి వ్యవసాయం ప్రారంభించాలన్నారు. గ్రామంలోని ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రాలను ఉపయోగించుకొని తమకు కాషాయాలను, ఘన, ద్రవ జీవామృతాలను కొనుగోలు చేసుకోనీ వాడుకోవచ్చు అని అన్ని రకాల కషాయాలు లభిస్తాయి అని అలాగే ప్రతి రైతు కచ్చితంగా ఒకే పంట కాకుండా పంట మార్పిడి విధానంతో వ్యవసాయం చేయాలని రైతులకు సూచించారు. అనంతరం ఎంఎఫ్ఏ. నాగరాజు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రంను అందరూ రైతులు ఉపయోగించుకోవాలని ఈబిఆర్ సీ కేంద్రం ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తుందని అలాగే అన్ని రకాల కాషాయాలు, పిఏండిఎస్ కిట్లు, విత్తనాలు లభిస్తాయి అని రైతులు వినియోగించుకోవాలన్నారు. లాంగ్ మాస్టర్ ట్రైనర్ మహబూబ్ భాష ప్రకృతి వ్యవసాయంలో పంట సాగు మరియు కాషాయాల వినియోగం మీద రైతులకు అవగాహన కల్పించారు. ప్రకృతి వ్యవసాయంలో పంటల సాగు విధానం, పిఏండిఎస్ పద్దతి గురించి వివరించటం జరిగింది. జీవామృతం తయారు చేసి దాని వినియోగం గురించి రైతులకు పూర్తిగా తెలుపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ ఆర్ పి. నరేంద్ర గౌడ్, ఎన్ ఎఫ్ ఏ నాగరాజు, మాస్టర్ ట్రైనర్ మహబూబ్ బాషా, డిఎంఎంటి సుబ్బారాయుడు, యూనిట్ ఇంచార్జి లు నజీర్, చక్రవర్తి, నాగరాజు, గ్రామ ఐసిఆర్పి లు, గ్రామ రైతులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
E Nivas News