Friday, 11 September 2026 08:13:16 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం -గ్రామాల్లో బిజెపి బలోపేతం... మండల అధ్యక్షులు రాయపాటి మురళీమోహన్

Date : 06 September 2026 02:52 AM Views : 42

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రామాల్లో బిజెపి బలోపేతం చేస్తామని మండల అధ్యక్షులు రాయపాటి మురళీమోహన్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు, నంద్యాల జిల్లా అధ్యక్షుడు డాక్టర్ అభిరుచి మధు సూచనల మేరకు శనివారం మండల కేంద్రంలోని, బిజెపి కార్యాలయంలో మండల పదాధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి మండల అధ్యక్షుడు రాయపాటి మురళీమోహన్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసి, బిజెపి జెండాను రెపరెపలాడేలా కృషి చేస్తామని తెలిపారు. కేంద్ర సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి స్థానంలో బిజెపి అభ్యర్థి పోటీ చేసేలా ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందించుకోవాలని నాయకులకు సూచించారు. ముఖ్యంగా పార్టీపై ఆసక్తి ఉన్న యువతను బిజెపి లోకి తీసుకురావాలని, స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. బిజెపి కార్యకర్తలకు పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు. మండల పదాధికారులు ప్రజలతో నిరంతరం మమేకమై, గ్రామాల్లోని ప్రజా సమస్యలను గుర్తించి వాటిని పార్టీ నాయకుల ద్వారా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి, ప్రతి గ్రామంలో బిజెపికి బలమైన కార్యకర్తల బృందాన్ని ఏర్పాటు చేయాలని నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పదాధికారులు ప్రవీణ్ కుమార్, గోపాలకృష్ణయ్య, రామాంజనేయులు, వెంకటేశ్వర్లు, మల్లికార్జున, మంగలి వెంకటేశ్వర్లు, ఇమ్రాన్ భాష, ఎస్.కె.ఖాజా వలి, ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :