ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు శాఖ గ్రంధాలయం నందు 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా ఈరోజు భారతదేశపు తొలి మహిళా ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ 108వ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి గ్రంథాలయ అధికారి సి.వి.కృష్ణారెడ్డి విద్యార్థులు, పాఠకులతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రంధాలయ అధికారి సి.వి.కృష్ణారెడ్డి మాట్లాడుతూ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గరీబీ హటావో-దేశ్ బచావో నినాదంతో పేదరికం కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కొరకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఆమె భారతదేశ జాతీయ కాంగ్రెస్ తొలి మహిళ అధ్యక్షురాలుగా పనిచేయడం జరిగిందన్నారు. ఎస్సీ ఎస్టీల అసమానతలు తగ్గించడానికి, అంటరానితనంను రూపుమాపడానికి చాలా కృషి చేసిన మహోన్నత వ్యక్తి అన్నారు. మనమందరం కూడా ఆమె అడుగుజాడల్లో నడచి, ఆమె ఆశయ సాధన కోసం నడుం బిగించాలన్నారు. ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ విద్యార్థిని, విద్యార్థులు మరియు పాఠకులు వీరన్న, పరమేష్, నాగిరెడ్డి పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News